IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
- టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్
- ఇంగ్లండ్తో భారత్ ఢీ
- తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja out and Sanju Samson in For IND vs ENG Semi Final 2: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 27) ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్లో ఇంగ్లండ్ను భారత్ ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లండ్ సమఉజ్జివులుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్లో టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లోనే ఛేదించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ను ఓడించాలంటే.. అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
టీ20 ప్రపంచకప్ 2024లో రవీంద్ర జడేజా నిరాశపర్చుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గయానా పిచ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్కు అనుకూలిస్తుంటుంది. అందుకే శాంసన్ను తీసుకుంటే.. భారీ స్కోరు లేదా భారీ ఛేదనను చేయవచ్చని భారత్ భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Also Read: Frank Duckworth Death: ‘డక్వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్వర్త్ మృతి!
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!