IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
- టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్
- ఇంగ్లండ్తో భారత్ ఢీ
- తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja out and Sanju Samson in For IND vs ENG Semi Final 2: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 27) ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్లో ఇంగ్లండ్ను భారత్ ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లండ్ సమఉజ్జివులుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్లో టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లోనే ఛేదించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ను ఓడించాలంటే.. అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
టీ20 ప్రపంచకప్ 2024లో రవీంద్ర జడేజా నిరాశపర్చుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గయానా పిచ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్కు అనుకూలిస్తుంటుంది. అందుకే శాంసన్ను తీసుకుంటే.. భారీ స్కోరు లేదా భారీ ఛేదనను చేయవచ్చని భారత్ భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Also Read: Frank Duckworth Death: ‘డక్వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్వర్త్ మృతి!
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!