Chandrababu Naidu: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Released TDP Manifesto In Mahanadu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని, ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.
Crime News: దారుణం.. 12 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన దుర్మార్గులు.. అంతా తల్లి తప్పే..?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
యువగళం కింద ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని.. అలాగే యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు మాటిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనని ఎత్తివేస్తామని చెప్పారు. రైతు కోసం అన్నదాత కార్యక్రమం తెస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ అందించి, ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో.. పేదలను ధనుకుల్ని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. పూర్ టూ రిచ్ పేరుతో పథకం తీసుకొస్తానన్న ఆయన.. పేదోడ్ని ధనుకుడు చేయడమే తన సంకల్పమని ఉద్ఘాటించారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను దసరాకి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
ఇది ఎన్టీఆర్ శకమని.. క్రీస్తు శకం తరహాలో ఎన్టీఆర్ శకం అని చెప్పుకునేలా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటేనే సంక్షేమమని అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, అన్ని వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. టీడీపీది ప్రజాబలమని, మనది విజన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. అవినీతి డబ్బును పేదలకు పంచుతానన్నారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!