Chandrababu Naidu: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Released TDP Manifesto In Mahanadu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని, ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.
Crime News: దారుణం.. 12 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన దుర్మార్గులు.. అంతా తల్లి తప్పే..?
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
యువగళం కింద ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని.. అలాగే యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు మాటిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనని ఎత్తివేస్తామని చెప్పారు. రైతు కోసం అన్నదాత కార్యక్రమం తెస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ అందించి, ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో.. పేదలను ధనుకుల్ని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. పూర్ టూ రిచ్ పేరుతో పథకం తీసుకొస్తానన్న ఆయన.. పేదోడ్ని ధనుకుడు చేయడమే తన సంకల్పమని ఉద్ఘాటించారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను దసరాకి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
ఇది ఎన్టీఆర్ శకమని.. క్రీస్తు శకం తరహాలో ఎన్టీఆర్ శకం అని చెప్పుకునేలా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటేనే సంక్షేమమని అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, అన్ని వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. టీడీపీది ప్రజాబలమని, మనది విజన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. అవినీతి డబ్బును పేదలకు పంచుతానన్నారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!