Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Fires On Kishan Reddy PM Modi: ప్రధాని మోడీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా అయితే.. చేసేవి మాత్రం తోడో ఇండియా అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేవలం తమకు నచ్చిన రాష్ట్రానికి మాత్రమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోందని, ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెదక్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు దశాబ్ది ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదని విరుచుకుపడ్డారు. నాడు ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి రాలేదని, నేడు ఉత్సవాలకు రావడం లేదని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారని.. కానీ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ఈ ఉత్సవాలు చేస్తున్నారు? ఏం చేయలేదనే ఉత్సవాలు చేస్తావా? అంటూ కౌంటర్ వేశారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే.. అమరులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అని ప్రశ్నించిన మంత్రి.. ఇప్పటికైనా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
Ranga Reddy Crime News: అల్లుడి కిరాతకం.. భార్యని ఇంటికి పంపించట్లేదని..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
నీతి ఆయోగ్ సమావేశానికి రాలేదని కిషన్రెడ్డి చెప్తున్నారని.. అసలు నీతి ఆయోగ్కు ఇజ్జత్ ఉందా? నీతి ఆయోగ్కు పరువు తీసింది మీరు, విలువ లేకుండా చేసింది మీరు అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నీతి ఆయోగ్కు రూ.25 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని.. గవర్నర్ నామినేటెడ్ అయితే, రాష్ట్రపతి ఎన్నికవుతారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. ఏపీకి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై కక్ష కడుతోందని విమర్శించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, హక్కులను కాపాడాలని సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, వారికి వంతపాడే రాష్టాలకు ఒక తీరు.. తప్పులను ఎత్తిచూపితే మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమకు నిధులు ఇవ్వనప్పుడు.. నీతి ఆయోగ్ మీటింగ్ ఎందుకు రావాలని నిలదీశారు.
Fungal Meningitis: ఫంగల్ మెనింజైటిస్తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!