Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
Harish Rao Fires On Kishan Reddy PM Modi: ప్రధాని మోడీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా అయితే.. చేసేవి మాత్రం తోడో ఇండియా అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేవలం తమకు నచ్చిన రాష్ట్రానికి మాత్రమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోందని, ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెదక్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు దశాబ్ది ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదని విరుచుకుపడ్డారు. నాడు ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి రాలేదని, నేడు ఉత్సవాలకు రావడం లేదని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారని.. కానీ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ఈ ఉత్సవాలు చేస్తున్నారు? ఏం చేయలేదనే ఉత్సవాలు చేస్తావా? అంటూ కౌంటర్ వేశారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే.. అమరులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అని ప్రశ్నించిన మంత్రి.. ఇప్పటికైనా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
Ranga Reddy Crime News: అల్లుడి కిరాతకం.. భార్యని ఇంటికి పంపించట్లేదని..
Also Read
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
నీతి ఆయోగ్ సమావేశానికి రాలేదని కిషన్రెడ్డి చెప్తున్నారని.. అసలు నీతి ఆయోగ్కు ఇజ్జత్ ఉందా? నీతి ఆయోగ్కు పరువు తీసింది మీరు, విలువ లేకుండా చేసింది మీరు అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నీతి ఆయోగ్కు రూ.25 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని.. గవర్నర్ నామినేటెడ్ అయితే, రాష్ట్రపతి ఎన్నికవుతారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. ఏపీకి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై కక్ష కడుతోందని విమర్శించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, హక్కులను కాపాడాలని సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, వారికి వంతపాడే రాష్టాలకు ఒక తీరు.. తప్పులను ఎత్తిచూపితే మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమకు నిధులు ఇవ్వనప్పుడు.. నీతి ఆయోగ్ మీటింగ్ ఎందుకు రావాలని నిలదీశారు.
Fungal Meningitis: ఫంగల్ మెనింజైటిస్తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..
తాజావార్తలు
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?