Chandrababu Naidu: మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్ట్ పై డీజీపీకి చంద్రబాబు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Letter To DGP :ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)పార్టీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు అదేశాలకు విరుద్దంగా సిఐడి పోలీసులు వ్యవహరించారు…వెంటనే నరేంద్రను విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సుమారు 7 మంది వ్యక్తులు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్ లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్లోకి ప్రవేశించి, తాము సిఐడికి అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారు.
Read Also: Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలి.ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్ను టార్గెట్ చేయడంలో సిఐడి పూర్తిగా నిమగ్నమైంది. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసినవిషయం గుర్తులేదా?సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
టీడీపీ కార్యాలయంపై వైఎస్ఆర్సిపి దాడి చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.సిఐడి తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుంది.వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోంది. అధికార పార్టీ ప్రయోజనాల కోసం సిఐడి దిగజారడం బాధాకరం.బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారు.దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నా అని డీజీపీ రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

Read ALso: Karnataka Hijab Ban: హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
తాజావార్తలు
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!