Chandra Babu: నాలుగంటే నాలుగే.. ఇదేనా జగన్ సర్కార్ వరద సాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది జగన్ సర్కార్ వరద సాయం అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
నాలుగంటే నాలుగే! ఇది జగన్ సర్కార్ వరద సాయం.
Also Read
- Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి 'పాడే యాత్రే'.!
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!
ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం….లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే!#APFloods2022 pic.twitter.com/WqzEu1BIiy
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2022
కాగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్ తన కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
Read Also: Pawan Kalyan: బటన్ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి
మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు కూడా ఆరోపణలు చేశారు. గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేకే ప్రభుత్వం పోలవరం ఎత్తు అంశంపై డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. టీడీపీ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని నిలదీశారు. కేంద్ర జలశక్తి పరిధిలో అంశాలపై ఏపీ, తెలంగాణ నేతలు స్పందించడానికి కారణం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ