Chandra Babu: నాలుగంటే నాలుగే.. ఇదేనా జగన్ సర్కార్ వరద సాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది జగన్ సర్కార్ వరద సాయం అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
నాలుగంటే నాలుగే! ఇది జగన్ సర్కార్ వరద సాయం.
Also Read
నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!
ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం….లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే!#APFloods2022 pic.twitter.com/WqzEu1BIiy
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2022
కాగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్ తన కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
Read Also: Pawan Kalyan: బటన్ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి
మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు కూడా ఆరోపణలు చేశారు. గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేకే ప్రభుత్వం పోలవరం ఎత్తు అంశంపై డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. టీడీపీ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని నిలదీశారు. కేంద్ర జలశక్తి పరిధిలో అంశాలపై ఏపీ, తెలంగాణ నేతలు స్పందించడానికి కారణం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!