Byreddy Rajasekhar Reddy: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు
Byreddy Rajasekhar Reddy Sensational Comments On Upper Bhadra Project: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు అవుతుందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రూపంలో రాయలసీమకు మరో విపత్తు పొంచి ఉందని పేర్కొన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, తొలి విడతలో 5,400 కోట్లు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. అప్పర్ భద్రకు వ్యతిరేకంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు సాధన కోసం ఈనెల 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపడతామని అన్నారు. 25న ఆర్డీఎస్ నుంచి ఆదోని వరకు పాదయాత్ర చేసి.. 28న ఆదోనిలో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని, ఇది ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్కు దారి తీస్తుందని హెచ్చరించారు. రాజకీయల కంటే రాయలసీమ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మిస్తేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కేవలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల నుంచి బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలని మద్దతు లభిస్తోందన్నారు. సిద్ధేశ్వరం అలుగు కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉందన్నారు. బ్రిడ్జి కం బ్యారేజి కోసం 12వ తేదీ రాయలసీమలోని 52 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.
INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 ఆలౌట్
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
అంతకుముందు కూడా రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి – బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ చేసిన ఆయన.. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే, రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత తక్కువ నీటి పారుదల ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అని లెక్కలు చెబుతున్నాయన్నారు. 75 ఏళ్లుగా రాయలసీమకు నేతలు మోసం చేస్తూ వస్తున్నారన్నారు.
KTR fire on Revanth Reddy: రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. శ్రీధర్, భట్టన్నలు మంచోల్లు
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?