Byreddy Rajasekhar Reddy: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Rajasekhar Reddy Sensational Comments On Upper Bhadra Project: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు అవుతుందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రూపంలో రాయలసీమకు మరో విపత్తు పొంచి ఉందని పేర్కొన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, తొలి విడతలో 5,400 కోట్లు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. అప్పర్ భద్రకు వ్యతిరేకంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు సాధన కోసం ఈనెల 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపడతామని అన్నారు. 25న ఆర్డీఎస్ నుంచి ఆదోని వరకు పాదయాత్ర చేసి.. 28న ఆదోనిలో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని, ఇది ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్కు దారి తీస్తుందని హెచ్చరించారు. రాజకీయల కంటే రాయలసీమ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మిస్తేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కేవలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల నుంచి బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలని మద్దతు లభిస్తోందన్నారు. సిద్ధేశ్వరం అలుగు కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉందన్నారు. బ్రిడ్జి కం బ్యారేజి కోసం 12వ తేదీ రాయలసీమలోని 52 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.
INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 ఆలౌట్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
అంతకుముందు కూడా రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి – బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ చేసిన ఆయన.. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే, రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత తక్కువ నీటి పారుదల ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అని లెక్కలు చెబుతున్నాయన్నారు. 75 ఏళ్లుగా రాయలసీమకు నేతలు మోసం చేస్తూ వస్తున్నారన్నారు.
KTR fire on Revanth Reddy: రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. శ్రీధర్, భట్టన్నలు మంచోల్లు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!