Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్కు పనికిరారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని కోర్టులు స్పష్టం చేసినా వైసీపీ నేతలు రాజకీయం కోసమే రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారన్నారు.
Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
టీడీపీ హయాంలో దూరదృష్టితో ఆలోచించి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని భావించామని.. కానీ లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు ఎక్కడ జరిగాయో చూపించాలని వైసీపీ నేతలను బోండా ఉమా ప్రశ్నించారు. న్యాయబద్ధంగా ఏర్పడిన అమరావతిని జగన్ ఏమీ చేయలేరని.. టీడీపీ నాయకులను ఏమీ పీకలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై పెట్టిన అవినీతి కేసుల్లో ఒక్కటైనా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. న్యాయ స్థానాలలో అనేక చీవాట్లు తిన్న దేశంలోని ఏకైక సీఎం జగన్ మాత్రమే అని విమర్శించారు. ఆయన వల్ల అనేక మంది అధికారులకు శిక్షలు పడుతున్నాయని బోండా ఉమ ఆరోపించారు. ఏపీని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా తయారుచేశారని.. పదో తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేని సీఎం జగన్ అని బోండా ఉమా అన్నారు. రాబోయే రోజుల్లో దొంగల పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడప గడపకు ఆ పార్టీ నేతలు వెళ్తుంటే ప్రజలు ఛీ కొడుతున్నారని.. 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు. ఏపీలోని ఉన్న బీసీ నాయకులు జగన్కు పనికిరాకుండా పోయారా అని బోండా ఉమా నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!