Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్కు పనికిరారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని కోర్టులు స్పష్టం చేసినా వైసీపీ నేతలు రాజకీయం కోసమే రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారన్నారు.
Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
టీడీపీ హయాంలో దూరదృష్టితో ఆలోచించి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని భావించామని.. కానీ లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు ఎక్కడ జరిగాయో చూపించాలని వైసీపీ నేతలను బోండా ఉమా ప్రశ్నించారు. న్యాయబద్ధంగా ఏర్పడిన అమరావతిని జగన్ ఏమీ చేయలేరని.. టీడీపీ నాయకులను ఏమీ పీకలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై పెట్టిన అవినీతి కేసుల్లో ఒక్కటైనా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. న్యాయ స్థానాలలో అనేక చీవాట్లు తిన్న దేశంలోని ఏకైక సీఎం జగన్ మాత్రమే అని విమర్శించారు. ఆయన వల్ల అనేక మంది అధికారులకు శిక్షలు పడుతున్నాయని బోండా ఉమ ఆరోపించారు. ఏపీని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా తయారుచేశారని.. పదో తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేని సీఎం జగన్ అని బోండా ఉమా అన్నారు. రాబోయే రోజుల్లో దొంగల పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడప గడపకు ఆ పార్టీ నేతలు వెళ్తుంటే ప్రజలు ఛీ కొడుతున్నారని.. 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు. ఏపీలోని ఉన్న బీసీ నాయకులు జగన్కు పనికిరాకుండా పోయారా అని బోండా ఉమా నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!