Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్కు పనికిరారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని కోర్టులు స్పష్టం చేసినా వైసీపీ నేతలు రాజకీయం కోసమే రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారన్నారు.
Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ హయాంలో దూరదృష్టితో ఆలోచించి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని భావించామని.. కానీ లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు ఎక్కడ జరిగాయో చూపించాలని వైసీపీ నేతలను బోండా ఉమా ప్రశ్నించారు. న్యాయబద్ధంగా ఏర్పడిన అమరావతిని జగన్ ఏమీ చేయలేరని.. టీడీపీ నాయకులను ఏమీ పీకలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై పెట్టిన అవినీతి కేసుల్లో ఒక్కటైనా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. న్యాయ స్థానాలలో అనేక చీవాట్లు తిన్న దేశంలోని ఏకైక సీఎం జగన్ మాత్రమే అని విమర్శించారు. ఆయన వల్ల అనేక మంది అధికారులకు శిక్షలు పడుతున్నాయని బోండా ఉమ ఆరోపించారు. ఏపీని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా తయారుచేశారని.. పదో తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేని సీఎం జగన్ అని బోండా ఉమా అన్నారు. రాబోయే రోజుల్లో దొంగల పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడప గడపకు ఆ పార్టీ నేతలు వెళ్తుంటే ప్రజలు ఛీ కొడుతున్నారని.. 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు. ఏపీలోని ఉన్న బీసీ నాయకులు జగన్కు పనికిరాకుండా పోయారా అని బోండా ఉమా నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!