GVL Meeting with Kapu Leaders: కన్నా రాజీనామాను ముందు పసిగట్టిన బీజేపీ.. ఇలా ప్లాన్ చేసిన జీవీఎల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Meeting with Kapu Leaders: భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తూ.. సీనియర్ నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీకి గుడ్బై చెప్పారు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన ముఖ్యఅనుచరుల సమావేశంలో ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.. అయితే, కన్నా రాజీనామా ఎపిసోడును బీజేపీ ముందుగానే పసిగట్టినట్టుగా తెలుస్తోంది.. కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సమావేశాలు పెట్టుకున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. బీజేపీ నుంచి కాపు ఫ్లేవర్ దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇవాళ ఉదయం నుంచి ఎంపీ జీవీఎల్ తో కాపు నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి.. దివంగత నేత వంగవీటి రంగా గురించి జాతీయ స్థాయిలో జీవీఎల్ ప్రస్తావించారంటూ కాపు నేతలు కితాబిస్తున్నారు..
Read Also: Big Breaking: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్బై చెప్పిన కన్నా..
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, విజయవాడలో ఈ రోజు వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీవీఎల్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్లో ప్రస్తావించాను అని గుర్తుచేసుకున్నారు.. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటనగా పేర్కొన్న ఆయన.. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా అంటూ ప్రశంసలు కురిపించారు.. రాజకీయాలనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా.. మిగిలినవారి పేర్లు కనిపించవా..? అంటూ అటు అధికార పక్షం, ఇటు విపక్షంపై ఫైర్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Read Also: Kanna Lakshminarayana: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయ రాజీనామా..?
మరోవైపు, జీవీఎల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాపు నేతలు.. జీవీఎల్ పార్లమెంటులో రంగా గురించి ప్రస్తావన తేవడం ఆనందంగా ఉందన్నారు వంగవీటి నరేంద్ర.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగాకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. జిల్లాకు పేరు పెట్టాలని మేం పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రంగా పేరును ఓట్ల కోసం వాడుకుని పదవులు పొందారని విమర్శించిన ఆయన.. రంగా స్మారకంగా ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు.. కానీ, జీవీఎల్ .. వంగవీటి రంగా గురించి తెలుసుకుని స్పందించడం గొప్ప విషయం అన్నారు. విజయవాడ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని కోరుతున్నాం.. జిల్లాకు కూడా రంగా పేరు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మా ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే సమయంలో.. కన్నా రాజీనామా చేయడంపై తరువాత మాట్లాడతాం అన్నారు వంగవీటి నరేంద్ర..
Read Also: Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, రాధా రంగా రాయల్ అసోసియేషన్ నేత గాదె బాలాజీ మాట్లాడుతూ.. రంగా పేరు జిల్లాకి పెట్టాలని కాపు నాయకులు ఎప్పుడూ అడగలేదని.. సీఎంను అడిగే ధైర్యం చేయలేదని విమర్శించారు. జీవీఎల్ ఇప్పుడు మాకు మద్దతుగా పార్లమెంట్లో అన్నారు.. రంగా నాడు అని ఒక బహిరంగ సభ విజయవాడలో పెడతాం అన్నారు. మరోవైపు రాధా రంగా రాయల్ అసోసియేషన్ హరికృష్ణ మాట్లాడుతూ.. జిల్లాల అంశం వచ్చినప్పుడు కృష్ణాజిల్లాకు రంగా పేరు పెట్టాలని అందరూ అంగీకరించారు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సీఎం అంగీకరించలేదన్నారు.. రంగా పేరు పెట్టాలని అన్ని జిల్లాల్లో చేసిన కార్యక్రమాలకు స్పందన వచ్చిందని.. జీవీఎల్ ను అభినందించడంతో పాటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాం.. రంగా అభిమానులు అందరూ ఒక దగ్గరకి చేరడానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. రంగా హత్య చేసిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా మాకు శాశ్వత శత్రువులే అని ప్రకటించారు హరికృష్ణ. మొత్తంగా.. కన్నా వెంట కాపు నేతలు మరో పార్టీలోకి వెళ్లకుండా.. బీజేపీ ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!