Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలాకాలంగా జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో ధావన్కు తుది జట్టులో ప్లేస్ దక్కడం చాలా కష్టంగా మారిపోయింది. తాజాగా ఇదే విషయమై స్పందించాడు శిఖర్. జీవితంలో ఇలాంటి ఎత్తు పల్లాలు సహజమని తెలిపిన అతడు.. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని స్పష్టం చేశాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నానని చెప్పాడు.
Also Read: Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
“లైఫ్లో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాయి. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను. జట్టుకు దూరమైన కాలంలో మానసికంగా నేను మరింత ధృడంగా మారాను. చోటు కోల్పోవడాన్ని నెగెటివ్గా తీసుకోవడం లేదు. నాకంటే బాగా ఆడుతున్నారు కాబట్టే కొందరు టీమ్లో ఉన్నారు. నేను జట్టు నుంచి దూరమయ్యాను. రీఎంట్రీ ఇవ్వడానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఇప్పటికీ అవకాశం ఉంది. తప్పకుండా ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియా తరఫున అడుతాను” అంటూ శిఖర్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్కు టీమిండియా మేనేజ్మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్కు కూడా గిల్ ఓపెనర్గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. నవంబర్లో భారత్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించిన ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో డిసెంబరులో జరిగిన సిరీస్లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్ను పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న ఇతడు.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
Also Read: Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!