Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలాకాలంగా జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో ధావన్కు తుది జట్టులో ప్లేస్ దక్కడం చాలా కష్టంగా మారిపోయింది. తాజాగా ఇదే విషయమై స్పందించాడు శిఖర్. జీవితంలో ఇలాంటి ఎత్తు పల్లాలు సహజమని తెలిపిన అతడు.. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని స్పష్టం చేశాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నానని చెప్పాడు.
Also Read: Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
“లైఫ్లో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాయి. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను. జట్టుకు దూరమైన కాలంలో మానసికంగా నేను మరింత ధృడంగా మారాను. చోటు కోల్పోవడాన్ని నెగెటివ్గా తీసుకోవడం లేదు. నాకంటే బాగా ఆడుతున్నారు కాబట్టే కొందరు టీమ్లో ఉన్నారు. నేను జట్టు నుంచి దూరమయ్యాను. రీఎంట్రీ ఇవ్వడానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఇప్పటికీ అవకాశం ఉంది. తప్పకుండా ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియా తరఫున అడుతాను” అంటూ శిఖర్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్కు టీమిండియా మేనేజ్మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్కు కూడా గిల్ ఓపెనర్గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. నవంబర్లో భారత్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించిన ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో డిసెంబరులో జరిగిన సిరీస్లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్ను పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న ఇతడు.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
Also Read: Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!