Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలాకాలంగా జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో ధావన్కు తుది జట్టులో ప్లేస్ దక్కడం చాలా కష్టంగా మారిపోయింది. తాజాగా ఇదే విషయమై స్పందించాడు శిఖర్. జీవితంలో ఇలాంటి ఎత్తు పల్లాలు సహజమని తెలిపిన అతడు.. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని స్పష్టం చేశాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నానని చెప్పాడు.
Also Read: Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
Also Read
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
“లైఫ్లో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాయి. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను. జట్టుకు దూరమైన కాలంలో మానసికంగా నేను మరింత ధృడంగా మారాను. చోటు కోల్పోవడాన్ని నెగెటివ్గా తీసుకోవడం లేదు. నాకంటే బాగా ఆడుతున్నారు కాబట్టే కొందరు టీమ్లో ఉన్నారు. నేను జట్టు నుంచి దూరమయ్యాను. రీఎంట్రీ ఇవ్వడానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఇప్పటికీ అవకాశం ఉంది. తప్పకుండా ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియా తరఫున అడుతాను” అంటూ శిఖర్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్కు టీమిండియా మేనేజ్మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్కు కూడా గిల్ ఓపెనర్గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. నవంబర్లో భారత్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించిన ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో డిసెంబరులో జరిగిన సిరీస్లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్ను పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న ఇతడు.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
Also Read: Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్
తాజావార్తలు
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!