GVL Narasimha Rao: బీజేపీ ‘టచ్ చేసి చూడు’కు శ్రీకారం చుడుతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు. బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు.
ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు. టచ్ చేసి చూడు కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని.. ఏపీలో అన్ని పార్టీల నేతలను బీజేపీ టచ్ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బీజేపీలో చేరికలు విస్తృతం అవుతాయన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మోదీ హవాను మరోసారి రుజువు చేశాయని జీవీఎల్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫర్మామెన్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండబోతుందని.. 2024లో 404 పార్లమెంట్ సీట్లను గెలవడమే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తోందన్నారు.
Also Read
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
- AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
అటు ఏపీ బడ్జెట్పైనా బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. ఏపీ బడ్జెట్ ఉత్తుత్తి బడ్జెట్లా కనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగం జగనన్న స్తుతిలా సాగిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని.. వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి కూడా సరిపోయేలా లేదన్నారు. నవ్యాoధ్ర కలను నీరు గార్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. కులాల కార్పొరేషన్ల నిధులు వాళ్లకు వెళ్లడం లేదని జీవీఎల్ విమర్శలు చేశారు. పేరుకి మాత్రమే కార్పొరేషన్లు.. అక్కడ టీ తాగేందుకు కూడా డబ్బులు లేవన్నారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. బడ్జెట్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవి అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ను పార్టీ మేనిఫెస్టోలాగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈనెల 19న కడపలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ సభ పెడుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!