Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp Mp Gvl Narasimha Rao About Pm Modi Vizag Tour

GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్‌ పర్యటన.. ఎంపీ జీవీఎల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :November 9, 2022 , 12:46 pm
By Sudhakar Ravula
GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్‌ పర్యటన.. ఎంపీ జీవీఎల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని మోడీ.. వైజాగ్‌ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తాం.. కంచెర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీఐ వరకూ కిలోమీటర్‌ మేర ఈ రోడ్‌షో ఉంటుందన్నారు.. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ రోడ్ షో జరుగుతుందని.. 11న రాత్రి ఐఎన్‌ఎస్‌ చోళలో ప్రధాని బస చేస్తారని తెలిపారు. 12న 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేస్తారు.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు.. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైంది.. ఇది లక్ష పైన మత్స్యకార కుటుంబాలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. కోల్డ్ స్టోరీజీ, ఏసీ ఆక్షన్ హాల్, కొత్త జేటీల నిర్మాణం లాంటివి కూడా ఉన్నాయి.. రాయ్ పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ , కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ వరకూ డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుండి ఒడిశాలోని ఒంగుల్ వరకూ పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని వెల్లడించారు జీవీఎల్.

Read Also: Chinta Mohan: 2024లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. వైసీపీ, బీజేపీ తుడిచిపెట్టుకుపోతాయి..!

Also Read

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
  • Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఇక, విజయవాడ-నర్సాపూర్-భీమవరం-గుడివాడ-నిడదవోలు రైల్వే లైన్ డెవలప్ చెయ్యడం జరిగింది. దీనిలో 50 శాతం రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉంది.. కానీ, ఇప్పటి వరకు ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు జీవీఎల్‌ నరసింహారావు.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోవడమేనని ఆరోపించిన ఆయన.. కనీసం పీఎం సమక్షంలోనన్నా సీఎం వైఎస్‌ జగన్‌ వీటికి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని స్పష్టం చేశారు జీవీఎల్.. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయన్న ఆయన.. రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించాం.. త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుంది. రైల్వే జోన్ పై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుందన్నారు.. ఇక, ఇది అధికారిక పర్యటన కాబట్టి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానించడంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు.. కానీ, ప్రధాని విశాఖ పర్యటనను చిన్న చిన్న రాజకీయాల కోణంలో చూడొద్దు… ప్రధాని ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం అనేది వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. విశాఖ అభివృద్ధికి, బీజేపీ బలోపేతం కావడానికి పీఎం టూర్ టేకాఫ్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. అయితే, ప్రధాని పర్యటన కోసం చిరు వ్యాపారుల షాపులు కట్టేముందు కనీసం నోటీసైనా ఇవ్వాల్సిందన్నారు.. ఈ చర్య సమర్ధనీయం కాదన్నారు.. అసలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యు ఈ పర్యటనలో లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • CM YS Jagan
  • mp gvl narasimha rao
  • pawan kalyan

తాజావార్తలు

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

  • Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే

  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions