Amaravati : మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే రాజధాని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 19 నుంచి బీజేపీ ప్రజా పోరు ప్రారంభం అవుతుందన్నారు.. రాష్ట్రంలో 5 వేల చోట్ల సభలు నిర్వహిస్తామన్నారు. ఇక, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది లేదు.. అభివృద్ధి లేదు, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు సీఎం రమేష్.. ఇసుక అక్రమ వ్యవహారంలో ఎమ్మెల్యేలే వసూలు చేస్తున్నారని విమర్శించారు.. మట్కా, గుట్కా అక్రమ వ్యాపారం పోలీసుల సహకారంతో నేతలే చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు..
Read Also: Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదు
Also Read
నిరహార దీక్ష చేస్తే.. కడప ఉక్కును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు అతీ గతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రమేష్.. గండి కోటకు నీళ్ళు తెచ్చినా పంట పొలాలకు ఇవ్వడానికి సాగు నీటి కాలువలు లేవన్న ఆయన.. రైతుల పంటలకు బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు.. కనీస మద్దతు ధర లేదని విమర్శించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చ గొట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధి ఎక్కడా లేదు.. పాదయాత్రలో చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతికి మోడీ శంకు స్థాపన చేశారు.. ముమ్మాటికీ అదే రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు.
పాదయాత్రలో అల్లర్లు సృష్టించి, బీభత్సం చేస్తే అది బీజేపీపై చేసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు సీఎం రమేష్.. ఇక, నవంబర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఏపీలో ఉంటుందని వెల్లడించారు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. విజయవాడలో ప్లై ఓవర్ నేషనల్ హైవే అథారిటీ క్రింద కేంద్ర నిధులతో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు.. ఏపీలో ఒక్కటి చేశామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా..? అంటూ సవాల్ చేశారు. ఏమీ చేయలేక అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని ఆరోపణలు గుప్పించారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!