Amaravati : మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే రాజధాని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 19 నుంచి బీజేపీ ప్రజా పోరు ప్రారంభం అవుతుందన్నారు.. రాష్ట్రంలో 5 వేల చోట్ల సభలు నిర్వహిస్తామన్నారు. ఇక, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది లేదు.. అభివృద్ధి లేదు, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు సీఎం రమేష్.. ఇసుక అక్రమ వ్యవహారంలో ఎమ్మెల్యేలే వసూలు చేస్తున్నారని విమర్శించారు.. మట్కా, గుట్కా అక్రమ వ్యాపారం పోలీసుల సహకారంతో నేతలే చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు..
Read Also: Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదు
Also Read
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
నిరహార దీక్ష చేస్తే.. కడప ఉక్కును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు అతీ గతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రమేష్.. గండి కోటకు నీళ్ళు తెచ్చినా పంట పొలాలకు ఇవ్వడానికి సాగు నీటి కాలువలు లేవన్న ఆయన.. రైతుల పంటలకు బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు.. కనీస మద్దతు ధర లేదని విమర్శించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చ గొట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధి ఎక్కడా లేదు.. పాదయాత్రలో చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతికి మోడీ శంకు స్థాపన చేశారు.. ముమ్మాటికీ అదే రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు.
పాదయాత్రలో అల్లర్లు సృష్టించి, బీభత్సం చేస్తే అది బీజేపీపై చేసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు సీఎం రమేష్.. ఇక, నవంబర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఏపీలో ఉంటుందని వెల్లడించారు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. విజయవాడలో ప్లై ఓవర్ నేషనల్ హైవే అథారిటీ క్రింద కేంద్ర నిధులతో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు.. ఏపీలో ఒక్కటి చేశామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా..? అంటూ సవాల్ చేశారు. ఏమీ చేయలేక అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని ఆరోపణలు గుప్పించారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.
తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?