Vishnu Kumar Raju: విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్.. అది అనివార్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై రాష్ట్ర నాయకత్వం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందన్న ఆయన.. అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు.. వైసీపీతో ఉన్నామనే అభిప్రాయం కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు కుమార్ రాజు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
రాష్ట్ర, కేంద్ర అధిష్టానం ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాలని సూచించారు విష్ణకుమార్ రాజు.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యంగా పేర్కొన్నారు. ఒత్తిళ్ళు, ప్రలోభాలు పెట్టినా వైసీపీని ఆదరించకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనంగా అభివర్ణించారు. మరోవైపు.. తెలంగాణలో బీజేపీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని ప్రశంసలు కురిపించారు. పొలిటికల్ వ్యాక్యూ మ్ ను తెలంగాణ బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. ఏపీలోనే టీఎస్ మోడల్ విధానాలు బీజేపీ ఎదుగుదలకు అవసరం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, జనసేనతోనే మా పొత్తు.. టీడీపీ, వైసీపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవు అంటూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు, పలు సందర్భాలో స్పష్టం చేశారు.. కానీ, జనసేన, బీజేపీ.. తెలుగు దేశం కలిసి పని చేయాలంటూ విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!