AP and Telangana: విభజన సమస్యలు.. కొన్నింటిపై ఏకాభిప్రాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని ఏపీ పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.. వర్చువల్గా జరిగిన ఈ భేటీలో ఆంధ్ర సర్కార్ వేసిన కేసులు ఉపసంహరించుకుంటే ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధమని ఈ సందర్భంగా వెల్లడించింది టీఎస్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల విషయంలో లోపాల తొలగింపు, నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, ఏపీ, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల క్యాష్ క్రెడిట్ వ్యవహారంపై కీలక చర్చలు సాగాయి..
Read Also: Punjab: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే అమరీందర్ సింగ్ తొలగింపు..!
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన విభజన అంశాలపై జరిగిన సమావేశంలో.. విద్యుత్ బకాయిలపై APGENCO – కోర్టు కేసును ఉపసంహరించుకుంటే, ఏపీ పవర్ యుటిలిటీస్, టీఎస్ పవర్ యుటిలిటీల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాద పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది తెలంగాణ.. ఇక, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు కేసులతో సహా పై మూడు సమస్యల కారణంగా APSFC విభజన సమస్య పెండింగ్లో ఉంది.. అందువల్ల, కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప, APSFC విభజనపై మరింత పురోగతి సాధించలేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. పన్ను బకాయిల అసాధారణతను తొలగించడంపై జాయింట్ సెక్రటరీ (సెంటర్-స్టేట్), MHA తెలంగాణ అభిప్రాయాలను అంగీకరించారు.. ఈ సమస్య ద్వైపాక్షిక సమస్య కాదని నిర్ణయించారు… సమస్యను తొలగించడానికి అంగీకరించారు. ఇక, నగదు నిల్వ మరియు బ్యాంకు డిపాజిట్ల విభజనపై.. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలను పంపాలని జాయింట్ సెక్రటరీ (సీఎస్) తెలంగాణకు సూచించారు.. పౌర సరఫరాల కార్పోరేషన్ బకాయిల వివాదంలో కేంద్ర ప్రభుత్వం నుండి అందిన సబ్సిడీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ పౌర సరఫరాల కార్పోరేషన్ ఒప్పుకుంది.. రూ. 354 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించింది.. ఈ రోజు కేంద్ర హోంశాఖ సమావేశంలో ఐదు అజెండా అంశాల్లో ఒక అంశం ఇరు రాష్ట్రాలకు సంబంధించినది కాదని… తెలంగాణ వాదన తరవాత తొలగించారు.. మరో అంశం పై ఏకాభిప్రాయం రాగా… మరో రెండు అంశాలు ఏపీ కోర్టు కేసులు ఉప సంహఠించుకుంటే పరిష్కరించుకోవడానికి సిద్ధం అని తెలంగాణ తెలిపింది.
- Tags
తాజావార్తలు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
-
Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
-
Dhurandhar: ‘ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
-
Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!