Minister Chelluboina Venu: అమరావతి యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే వారిని దేవుడు రానివ్వడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి టు అరసవెల్లి పాదయాత్రపై కామెంట్లు చేసిన ఆయన.. అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు.. ఇక, కల్లు గీత కార్మికుల జీవితాల్లో భరోసా కల్పించే పాలసీ తెచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి.. గీత కార్మికుడు ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మంచి నిర్ణయం తీసుకున్నారన్న ఆయన.. తాటి చెట్టు రాష్ట్ర వృక్షంగా ఉన్న తమిళనాడులోనూ ఇంత ఎక్స్ గ్రేషియా లేదన్నారు.. పక్క రాష్ట్రం తెలంగాణలోనూ 5 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా ఉంది.. చంద్రబాబు కాలంలో ఇంటింటికీ బెల్ట్ షాపు పెట్టి.. గీత కార్మికులకు జీవన భృతి లేకుండా చేశారని మండిపడ్డారు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కోసం తాడిచెట్లు లేకుండా చేసింది నువ్వు కాదా? ఆదరణ పథకంలో కేవలం 14 వేల మందికి మోకులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 2 లక్షల మంది ఉన్నారు అంటాడు.. వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Read Also:DAV Public School: డీఏవీ స్కూల్కు మళ్లీ అనుమతి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
టీడీపీ ఎజెండానే అబద్దం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేణుగోపాల కృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు బీసీల జీవితాల్లో మార్పు తెస్తున్నాయన్న ఆయన.. చంద్రబాబు చేతిలో మోసపోయింది మాత్రం బీసీలే.. పార్లమెంట్ స్థాయిలో బీసీ మీటింగులు పెట్టీ ఆయన బీసీలకు చేసిన అన్యాయాలను చెప్తాడా…? అంటూ ఎద్దేవా చేశారు.. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా అన్నది, మత్స్యకారులను తోలు తీస్తా అన్నది ఎవరూ మర్చిపోలేదన్నారు. మరోవైపు. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. రైతుల ముసుగు తొలగింది.. .న్యాయస్థానం కూడా న్యాయం వైపు నిలిచిందన్నారు. మా ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఇది చేశాను అని చెప్తున్నాడు.. నీ 14 ఏళ్లలో ఏమీ చేసావో ఇంటింటికీ వెళ్లి చెప్పగలవా? అని నిలదీశారు.. బీసీల జీవితాలని మూడు తరాలు వెనక్కి వెళ్లేలా చేసిన వ్యక్తి చంద్రబాబు.. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదన్న ఆయన.. బీసీలు తను చెప్పినట్లు ఆడే కీలు బొమ్మలు, తోలు బొమ్మలు అనుకుంటున్నాడు.. ఇక చంద్రబాబును ఏ ఒక్క బీసీ కూడా నమ్మరని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!