Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా వార్తలు రాసింది అని ఫైర్ అయ్యారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వెల్లడించిన అంబటి.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది.. వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు?? చంద్రబాబు ప్రణాళికా రహితంగా వెళ్ళటం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
గోదావరి నది నీటిని మళ్లించి, స్పిల్ వే ఛానల్ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చెయ్యటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు అంబటి రాంబాబు.. ఈ విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని విమర్శించారు. ఇక, 35 కాంటూరు దగ్గర గ్రామాలకు పునరావాసం కల్పించాం.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే పూర్తి చేసి నదీ మార్గాన్ని మళ్ళించామని తెలిపారు.. రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ విషయంలో తెలియక కొంత పొరపాటు పడిన మాట వాస్తవం.. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ డయాఫ్రమ్ ఉంటుంది అనుకున్నా… తెలియనివి తెలుసుకుంటా అన్నారు. దేవినేని ఉమా గురించి అదో, ఇదో తెలియదు అంటున్నారు… వైద్యులకు చూపించుకోవటం మంచిదని సెటైర్లు వేశారు. డయాఫ్రమ్ వాల్ పడిన గుంతలు పూడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది.. నీళ్లు తోడాలంటే 2వేల కోట్లు ఖర్చు అవుతుంది.. ఈ పాపం చంద్రబాబుది కాదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!