చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించం.. హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బీజేపీ కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు.
బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి ఆత్మకూరు లోని మసీదు నిర్మాణంకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు ఆపించే ప్రయత్నం చేయాల్సి ఉండేదన్నారు. అంతేకానీ మంది మార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోదయోగ్యమైనది కాదన్నారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
మసీదు వద్ద ఘర్షణ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వెళ్లి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ వాళ్లు వెళ్లకుండా అక్కడక్కడే తిరగడం వలన గొడవ మరింత పెద్దదయిందన్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్ రెడ్డి వాహనంపై దాడి చేయడంతో..పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్ తో పాటు మిగిలిన వారిని స్టేషన్ కు తరలించారు. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి తో పాటు తన అనుచరులకు పోలీసులు రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడటం జరిగిందని హోంమంత్రి తెలిపారు.ఆత్మకూరు సంఘటనకు ప్రధాన కారకుడైన శ్రీకాంత్ రెడ్డితో పాటు మరో ఐదు మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదుచేసి జైలు పంపించినట్లు హోం మినిస్టర్ సుచరిత పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి పై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు హోంమంత్రి తెలిపారు. వీరందరిని కూడా కర్నూలు, కడప, అనంతపురం జైళ్లకు పోలీసులు తరలించారన్నారు.భారతీయ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఆత్మకూరు ఘటనను రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమైన చర్య అని హోంమంత్రి మండిపడ్డారు.
రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నిందుతుడిని కూడా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నామని హోం మినిస్టర్ సుచరిత స్పష్టంచేశారు. మన రాష్ట్రంలో పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పనిచేసే స్వేచ్ఛను గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారన్నారు. ఆత్మకూరు ఘటనలో పోలీసులు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నేరస్తులను శిక్షించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పైనా, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పైనా బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ మత రాజకీయాలను గమనిస్తూనే వున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడటం మానుకోవాలని బీజేపీ నాయకులకు హోంమంత్రి సుచరిత సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!