చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించం.. హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బీజేపీ కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు.
బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి ఆత్మకూరు లోని మసీదు నిర్మాణంకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు ఆపించే ప్రయత్నం చేయాల్సి ఉండేదన్నారు. అంతేకానీ మంది మార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోదయోగ్యమైనది కాదన్నారు.
Also Read
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మసీదు వద్ద ఘర్షణ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వెళ్లి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ వాళ్లు వెళ్లకుండా అక్కడక్కడే తిరగడం వలన గొడవ మరింత పెద్దదయిందన్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్ రెడ్డి వాహనంపై దాడి చేయడంతో..పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్ తో పాటు మిగిలిన వారిని స్టేషన్ కు తరలించారు. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి తో పాటు తన అనుచరులకు పోలీసులు రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడటం జరిగిందని హోంమంత్రి తెలిపారు.ఆత్మకూరు సంఘటనకు ప్రధాన కారకుడైన శ్రీకాంత్ రెడ్డితో పాటు మరో ఐదు మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదుచేసి జైలు పంపించినట్లు హోం మినిస్టర్ సుచరిత పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి పై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు హోంమంత్రి తెలిపారు. వీరందరిని కూడా కర్నూలు, కడప, అనంతపురం జైళ్లకు పోలీసులు తరలించారన్నారు.భారతీయ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఆత్మకూరు ఘటనను రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమైన చర్య అని హోంమంత్రి మండిపడ్డారు.
రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నిందుతుడిని కూడా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నామని హోం మినిస్టర్ సుచరిత స్పష్టంచేశారు. మన రాష్ట్రంలో పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పనిచేసే స్వేచ్ఛను గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారన్నారు. ఆత్మకూరు ఘటనలో పోలీసులు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నేరస్తులను శిక్షించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పైనా, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పైనా బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ మత రాజకీయాలను గమనిస్తూనే వున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడటం మానుకోవాలని బీజేపీ నాయకులకు హోంమంత్రి సుచరిత సూచించారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!