బెడ్స్లేక ఆస్పత్రుల్లో కరోనా బాధితులు గగ్గోలు..! సర్కార్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. దీంతో.. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని పరిస్థితి వచ్చింది.. ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఇబ్బంది పెడుతుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ బెడ్ల కొరతపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతుండడంతో.. అసలు ఉన్న బెడ్లు ఎన్ని… ఖాళీగా ఏమైనా ఉన్నాయా? అనేదానిపై ఆరా తీశారు.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 108 ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూ, జనరల్ బెడ్లకు లోటు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2106 ఐసీయూ బెడ్లకు గానూ సుమారు 1500 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు సమాచారాన్ని సేకరించారు. ఇక, 4174 జనరల్ బెడ్లకు గానూ సుమారు 3 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయంటున్నారు అధికారులు.. దీంతో.. బాధితులకు బెడ్లు కేటాయించాలని.. జిల్లాల వారీగా బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..