AP DGP:ఏపీ పోలీసులపై విశ్వసనీయత పెరిగింది
ఏపీలో పోలీసుల పనితీరు మెరుగుపడిందని, పోలీసులు బెనిఫిట్స్ గురించి ఎక్కువగా చింతించకండి ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని అన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డిజిపి పోలీస్ అధికారులు, సచివాలయ మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: BJP MLA: వీధికుక్కల నిర్మూలన మీవల్ల కాదా.? అయితే నాగాలాండ్ ప్రజలను పిలవండి..
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
మహిళా పోలీసుల ద్వారా చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయని డీజీపీ అభినందించారు.గత ఏడాది కాలంలో 77వేల కేసులు తగ్గించామని తెలిపారు. ఎ.పి పోలీస్ శాఖకు ఇది చాలా పెద్ద ఘనత అంటూ కొనియాడారు. అలాగే, కాకినాడ జిల్లాలో యువతిని నడిరోడ్డుపై నరికిన వాడికి నాలుగు నెలల్లో శిక్ష వేయించామని వెల్లడించారు.ఏపీ పోలీసు శాఖపై విశ్వసనీయత పెరిగిందని, దిశ చట్టం వచ్చేలోపు ఆస్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని వివరించారు.ప్రతి సిఐ, ఎస్ఐ కి 10 కేసులు చొప్పున దర్యాప్తు పూర్తిచేసేలా అప్పగిస్తున్నామని అన్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు వేయకండి కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వండని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.
ప్రతిపక్షాలు గొంతుక మేమెందుకు నొక్కుతామని, ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని స్పష్టం చేశారు. రాజమండ్రిలో డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిబంధనలను అతిక్రమించి అనపర్తిలో సభ నిర్వహించడాన్ని తప్పుపట్టారు అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని, సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Also: Leela Pavitra: నడిరోడ్డుపై పవిత్ర దారుణ హత్య.. అక్కడ 16 సార్లు కసితీరా పొడిచి
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?