BJP MLA: వీధికుక్కల నిర్మూలన మీవల్ల కాదా.? అయితే నాగాలాండ్ ప్రజలను పిలవండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోతే, నాగాలాండ్ ప్రజలు పిలవండి అంటూ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నాగాలాండ్ లోని కొంతమంది ప్రజలు కుక్కమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఒక్క రాంచీలోని రోజుకు దాదాపుగా 3000 మంది కుక్కకాటు వల్ల వస్తున్నారని బొకారో ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ అన్నారు. టీకాలు, స్టెలిలైజేషన్ లేకపోవడం వల్ల ప్రజలకు ముప్పు వాటిల్లితోందని ఆయన అన్నారు. కుక్కల దాడితో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించే నిబంధనను కూడా తీసుకురావాలన్నారు. కుక్కలు, పెంపుడు జంతువుల ప్రేమికులు సరైన లైసెన్స్ లేకుండా వాటిని పెంచుకుంటున్నారని బిరాంచి చెప్పారు. బొకారో నగరంలోని వీధి కుక్కలను పట్టుకోవడం, చికిత్స చేయడం,స్టెరిలైజ్ చేయడం వంటి ఏర్పాట్లు లేవని, రాంచీలోని అన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ధన్బాద్ ఎమ్మెల్యే మధుర మహ్తో మాట్లాడుతూ.. ఒక జిల్లాలో వీధికుక్కలను పట్టుకున్నప్పటికీ, మరో జిల్లాలో వాటిని విడిచిపెట్టి, అక్కడ ప్రజలకు సమస్యలను సృష్టిస్తున్నారని అన్నారు. బొకారో నుంచి తీసుకెళ్లిన వీధికుక్కలను ధన్బాద్లో వదిలేస్తున్నారని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కుక్కల దాడుల వల్ల ఏడాదికి 50 మంది మరణిస్తున్నారని సీపీఎం ఎమ్మెల్యే వినోద్ సింగ్ అన్నారు. దీనిపై ఇన్చార్జి మంత్రి సత్యానంద్ భోగ్తా సమాధానమిస్తూ.. ప్రభుత్వం త్వరలో సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. వీధికుక్కలను పట్టుకుని వాటికి వ్యాక్సిన్లు వేసి స్టెలిలైజ్ చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!