BJP MLA: వీధికుక్కల నిర్మూలన మీవల్ల కాదా.? అయితే నాగాలాండ్ ప్రజలను పిలవండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోతే, నాగాలాండ్ ప్రజలు పిలవండి అంటూ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నాగాలాండ్ లోని కొంతమంది ప్రజలు కుక్కమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఒక్క రాంచీలోని రోజుకు దాదాపుగా 3000 మంది కుక్కకాటు వల్ల వస్తున్నారని బొకారో ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ అన్నారు. టీకాలు, స్టెలిలైజేషన్ లేకపోవడం వల్ల ప్రజలకు ముప్పు వాటిల్లితోందని ఆయన అన్నారు. కుక్కల దాడితో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించే నిబంధనను కూడా తీసుకురావాలన్నారు. కుక్కలు, పెంపుడు జంతువుల ప్రేమికులు సరైన లైసెన్స్ లేకుండా వాటిని పెంచుకుంటున్నారని బిరాంచి చెప్పారు. బొకారో నగరంలోని వీధి కుక్కలను పట్టుకోవడం, చికిత్స చేయడం,స్టెరిలైజ్ చేయడం వంటి ఏర్పాట్లు లేవని, రాంచీలోని అన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ధన్బాద్ ఎమ్మెల్యే మధుర మహ్తో మాట్లాడుతూ.. ఒక జిల్లాలో వీధికుక్కలను పట్టుకున్నప్పటికీ, మరో జిల్లాలో వాటిని విడిచిపెట్టి, అక్కడ ప్రజలకు సమస్యలను సృష్టిస్తున్నారని అన్నారు. బొకారో నుంచి తీసుకెళ్లిన వీధికుక్కలను ధన్బాద్లో వదిలేస్తున్నారని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కుక్కల దాడుల వల్ల ఏడాదికి 50 మంది మరణిస్తున్నారని సీపీఎం ఎమ్మెల్యే వినోద్ సింగ్ అన్నారు. దీనిపై ఇన్చార్జి మంత్రి సత్యానంద్ భోగ్తా సమాధానమిస్తూ.. ప్రభుత్వం త్వరలో సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. వీధికుక్కలను పట్టుకుని వాటికి వ్యాక్సిన్లు వేసి స్టెలిలైజ్ చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!