Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan Key Comments On Vizag Capital At Global Investors Summit 2023

CM YS Jagan: రాజధానిపై సీఎం క్లారిటీ.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ వేదికగా కీలక ప్రకటన

Published Date :March 3, 2023 , 1:55 pm
By Sudhakar Ravula
CM YS Jagan: రాజధానిపై సీఎం క్లారిటీ.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ వేదికగా  కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో ఉన్న అవకాశాలను గుర్తుచేశారు.. ఇక, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు.. సంస్థలు, రంగాల గురించి చెబుతూనే.. రాజధానిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. విశాఖే పరిపాలనా రాజధానిగా స్పష్టం చేసిన సీఎం జగన్‌.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందన్న సీఎం.. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్నారు.. భౌగోళికంగా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉందన్నారు.. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉందని వెల్లడించారు.. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్న సీఎం.. నేను కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన చేయబోతున్నాను అంటూ జీఐఎస్‌ వేదికగా ప్రకటించారు.

Read Also: Global Investors Summit 2023: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉద్యోగాలు..

ఇక, విశాఖలో జీఐఎస్‌ నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు సీఎం జగన్.. ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను.. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ రోజు 92 ఎంవోయూలు వస్తాయని.. ఇవాళ దాదాపు 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంవోలు జరిగితే.. మిగతావి రేపు జరుగుతాయని వెల్లడించారు.. మొత్తంగా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కాగా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నారు.. మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతూనే ఉంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేసిన సర్కార్‌.. విశాఖలో పారిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.. దీనిపై ఎన్నోసార్లు మంత్రులు, వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.. ఈ మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ సీఎం వైఎస్‌ జగన్‌.. వైజాగ్‌ క్యాపిటల్‌పై స్పష్టంగా చెప్పారు.. ఇవాళ మరోసారి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Global Investors Summit 2023
  • Vizag
  • vizag capital

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions