CM YS Jagan: రాజధానిపై సీఎం క్లారిటీ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో ఉన్న అవకాశాలను గుర్తుచేశారు.. ఇక, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు.. సంస్థలు, రంగాల గురించి చెబుతూనే.. రాజధానిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. విశాఖే పరిపాలనా రాజధానిగా స్పష్టం చేసిన సీఎం జగన్.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందన్న సీఎం.. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్నారు.. భౌగోళికంగా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందన్నారు.. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉందని వెల్లడించారు.. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్న సీఎం.. నేను కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన చేయబోతున్నాను అంటూ జీఐఎస్ వేదికగా ప్రకటించారు.
Read Also: Global Investors Summit 2023: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉద్యోగాలు..
Also Read
ఇక, విశాఖలో జీఐఎస్ నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు సీఎం జగన్.. ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను.. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ రోజు 92 ఎంవోయూలు వస్తాయని.. ఇవాళ దాదాపు 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంవోలు జరిగితే.. మిగతావి రేపు జరుగుతాయని వెల్లడించారు.. మొత్తంగా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కాగా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నారు.. మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతూనే ఉంది వైఎస్ జగన్ సర్కార్.. మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేసిన సర్కార్.. విశాఖలో పారిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.. దీనిపై ఎన్నోసార్లు మంత్రులు, వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.. ఈ మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ సీఎం వైఎస్ జగన్.. వైజాగ్ క్యాపిటల్పై స్పష్టంగా చెప్పారు.. ఇవాళ మరోసారి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించారు.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!