CM YS Jagan: రాజధానిపై సీఎం క్లారిటీ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా కీలక ప్రకటన
CM YS Jagan: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో ఉన్న అవకాశాలను గుర్తుచేశారు.. ఇక, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు.. సంస్థలు, రంగాల గురించి చెబుతూనే.. రాజధానిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. విశాఖే పరిపాలనా రాజధానిగా స్పష్టం చేసిన సీఎం జగన్.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందన్న సీఎం.. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్నారు.. భౌగోళికంగా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందన్నారు.. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉందని వెల్లడించారు.. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్న సీఎం.. నేను కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన చేయబోతున్నాను అంటూ జీఐఎస్ వేదికగా ప్రకటించారు.
Read Also: Global Investors Summit 2023: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉద్యోగాలు..
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, విశాఖలో జీఐఎస్ నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు సీఎం జగన్.. ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను.. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ రోజు 92 ఎంవోయూలు వస్తాయని.. ఇవాళ దాదాపు 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంవోలు జరిగితే.. మిగతావి రేపు జరుగుతాయని వెల్లడించారు.. మొత్తంగా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కాగా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నారు.. మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతూనే ఉంది వైఎస్ జగన్ సర్కార్.. మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేసిన సర్కార్.. విశాఖలో పారిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.. దీనిపై ఎన్నోసార్లు మంత్రులు, వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.. ఈ మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ సీఎం వైఎస్ జగన్.. వైజాగ్ క్యాపిటల్పై స్పష్టంగా చెప్పారు.. ఇవాళ మరోసారి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో