Global Investors Summit 2023: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Investors Summit 2023: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది.. ఇవాళ ప్రారంభమైన జీఐఎస్.. రెండు రోజుల పాటు కొనసాగనుంది.. ఇక, ఈ సమ్మిట్ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖలో జీఐఎస్ జరగడం గర్వంగా ఉందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.. ఇవాళ 92 ఎంవోయూలు జరుగుతాయి.. వీటి ద్వారా 4 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. మిగిలిన ఎంవోయూలు రేపు జరుగుతాయని వెల్లడించారు.. పెట్టుబడులకే కాదు పకృతి అందాలకు కూడా విశాఖ నెలవు అని పేర్కొన్నారు.. ఇక, భారత దేశంలో అతి కీలకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతా విస్తరించి ఉన్నాయన్నారు.. విశాఖపట్నం చిన్న ఎకనామిక్ హబ్గా అభివర్ణించిన సీఎం.. సెప్టెంబర్లో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు… మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సిటీ వైజాగ్ అంటూ ఆహ్వానించారు..
Read Also: Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ముఖ్యమైన జీ 20 సదస్సుకు ఒక చిన్న రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రం సొంతం అన్నారు.. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయని వెల్లడించారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్గా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాం. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పారిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!