ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా.. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు డబ్బులు వేశాం. కానీ మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారు అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి సాధ్యం కాదు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం.. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని రైతులను నాశనం చేసింది చంద్రబాబు. ఆనాడే అభివృద్ధి చేసుంటే.. నేడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. జగన్ మాయమాటలతో ఏమార్చి.. మోసం చేశారు. కక్ష కట్టి భూములిచ్చిన రైతులను రోడ్డు మీదకు లాగారు అని తెలిపారు.
అయితే ఈనెల 28వ తేదీన ప్రభుత్వం పై పోరుబాటకు బీజేపీ సిద్దమవుతోంది. ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసే ఏకైక పార్టీ బీజేపీనే. ఏపీ అసెంబ్లీలో ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు. రోడ్లేయాలంటే.. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఏపీలో గత సిఎం, ప్రస్తుత సీఎం ప్రజలకు చేసిందేమీ లేదు. గత పాలకులు గ్రాఫిక్స్ తో మాయ చేస్తే.. నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారు. ఏపీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో వీరు చెప్పాలి. గత సీఎం, ఇప్పటి సీఎంకు అభివృద్ధి చేసే దమ్ముందా అని అడిగారు. పనులు చేయరు.. చేసే వారిని అడ్డుకుంటారా… మీలాంటి వారికి తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. దేశంలో కమ్యూనిస్టు లు కమీషన్ ఏజెంట్లుగా మారారు. దేశంలో విద్యా వ్యవస్థ ను కమ్యూనిస్టులే నాశనం చేశారు. ఏపీలో రామకృష్ణ… రామ, కృష్ణ అంటూ ఏమి మాట్లాడతారో కూడా తెలియదు అని పేర్కొన్నారు.