Gadikota Srikanth Reddy: మంత్రి రాంప్రసాద్ రెడ్డికి గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్.. నేను రెడీ.. మీరు వస్తారా..?
- మంత్రి రాంప్రసాద్ రెడ్డికి గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్..
- ఇష్టానుసారం ఆరోపణలు చేయడం తగదు...
- ద్వేషాలు, ఉద్వేగాలు సృష్టించేలా మాట్లాడడం తగదు..
- రాయచోటి అభివృద్ధి పై నేను చర్చకు సిద్ధం..
- . అధికారులతో కలిసి రండి అభివృద్ధి పై చర్చిద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని సవాల్ విసిరారు.. తాను రేపటి తరాల కోసం పనిచేస్తానని, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం కాదు – అభివృద్ధి చేయడం ముఖ్యం అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుందని, ఈ కాలంలో మంత్రి రాంప్రసాద్ ఏం అభివృద్ధి చేశారో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు గడికోట.. నిండు శాసనసభలో రాయచోటి గురించి ఆదోని ఎమ్మెల్యే అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు మౌనం ఎందుకు వహించారు? ఆ రోజే ఛాలెంజ్ చేయాల్సింది అని సూచించారు.. ప్రస్తుత కేబినెట్లో క్యాబినెట్లోనే జిల్లాను విభజించే యత్నాలు జరుగుతున్నాయని, దానిని ఆపేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం అంటూ బెదిరించడం వల్ల ఎవరూ భయపడరు. అభివృద్ధి గురించి మాట్లాడటానికి దమ్ము అవసరం లేదు అని గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు చెప్పారు.. చివరగా ఆయన మంత్రి రాంప్రసాద్ను సవాల్ చేస్తూ అన్నారు.. రాయచోటి అభివృద్ధిపై చర్చకు రెడీ.. నేను వస్తా… మీరు రండి.. అభివృద్ధి పై చర్చిద్దాం అని ఛాలెంజ్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!