CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- సహకరించాల్సిన వాళ్ళు బంద్ పెట్టారు
- బంద్ పెట్టారు కదా.. ఫీజులు అడగరా..?
- ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో నాకు తెలియదా..?
- చూద్దాం.. వచ్చే ఏడాది నుండి ఎట్లా డొనేషన్లు తీసుకుంటారో : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
“సహకరించాల్సిన వారు బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టారు కదా, ఫీజులు అడగరా..? మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా వాటిని విడతల వారీగా చెల్లిస్తాం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు” అని ఆయన హెచ్చరించారు. ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని కానీ ప్రభుత్వం ఒత్తిడికి లోనుకావడం లేదని చెప్పారు. “విద్య సేవ.. వ్యాపారం కాదు. విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లనో నాకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇప్పటివరకు ఆపని చేయలేదు. కానీ అవసరమైతే చూడాలి” అని రేవంత్ హెచ్చరించారు.
ప్రైవేట్ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. “మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు. వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం” అని అన్నారు. అధికారులపై కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. “అధికారులను తిడతారట..! ఎట్లా తిడతారు? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్ధుల భవిష్యత్తు పణంగా పెట్టొద్దు. విద్యార్ధులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించం” అని స్పష్టం చేశారు. అరోరా కాలేజీ రమేష్ కి ఎన్ని అనుమతి ఇవ్వాలి మహబూబ్ నగర్ లో క్యాంప్ ఉంటది..హైదరాబాద్ లో అనుమతి ఇవ్వాలి అంట అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!