CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- సహకరించాల్సిన వాళ్ళు బంద్ పెట్టారు
- బంద్ పెట్టారు కదా.. ఫీజులు అడగరా..?
- ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో నాకు తెలియదా..?
- చూద్దాం.. వచ్చే ఏడాది నుండి ఎట్లా డొనేషన్లు తీసుకుంటారో : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..
Also Read
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- CM Revanth Reddy: "ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత".. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
“సహకరించాల్సిన వారు బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టారు కదా, ఫీజులు అడగరా..? మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా వాటిని విడతల వారీగా చెల్లిస్తాం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు” అని ఆయన హెచ్చరించారు. ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని కానీ ప్రభుత్వం ఒత్తిడికి లోనుకావడం లేదని చెప్పారు. “విద్య సేవ.. వ్యాపారం కాదు. విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లనో నాకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇప్పటివరకు ఆపని చేయలేదు. కానీ అవసరమైతే చూడాలి” అని రేవంత్ హెచ్చరించారు.
ప్రైవేట్ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. “మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు. వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం” అని అన్నారు. అధికారులపై కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. “అధికారులను తిడతారట..! ఎట్లా తిడతారు? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్ధుల భవిష్యత్తు పణంగా పెట్టొద్దు. విద్యార్ధులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించం” అని స్పష్టం చేశారు. అరోరా కాలేజీ రమేష్ కి ఎన్ని అనుమతి ఇవ్వాలి మహబూబ్ నగర్ లో క్యాంప్ ఉంటది..హైదరాబాద్ లో అనుమతి ఇవ్వాలి అంట అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్
తాజావార్తలు
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!