Ramprasad Reddy: మిధున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్..
- ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- అధికారం ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు- మంత్రి
- అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడు- రాంప్రసాద్ రెడ్డి
- పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై ప్రేలాపాలు చేయడం చాలా తప్పు-మంత్రి.
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు… అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు. పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై విచిత్రమైన ప్రేలాపాలను చేయడం చాలా తప్పు అని దుయ్యబట్టారు. ఆ రోజు వైసీపీ వారు చేసిన తప్పులకు నేడు 11 సీట్లు వాళ్లకు వస్తే.. 160 సీట్లు పైగా కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్ని అరచి గగ్గోలు పెట్టిన కూడా ఎలక్షన్ వచ్చేది నాలుగున్నర సంవత్సరం తరువాతేనని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు నీతి, నిజాయితీగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. ప్రజా క్షేత్రంలో పాలకపక్షం ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపించే అర్హత, బాధ్యత వైసీపీ వాళ్లకు ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్
అంతకుముందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు ఆగిపోయాయి.. అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. పనులు చేసి ప్రాజెక్టును పూర్తి చేయకుండా టెండర్ రద్దు చేయాలని అనుకోవడం దారుణమని అన్నారు. మదనపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.. అలాగే, చాలా గ్రామాలకు ఇప్పటివరకు రోడ్లు లేవు, రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అవసరం ఉందని మిధున్ రెడ్డి మాట్లాడారు.
AI Robot Girlfriend: మార్కెట్లోకి ఏఐ గర్ల్ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?