Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- మొలకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చే ప్రయత్నం
- గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ ఆలయం వద్ద బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్ళకు గంతలు కట్టిన దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12 నెలల క్రితం బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Read Also: IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అయితే.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు. దీంతో ఆలయం ఒక వైపు వెళ్ళిపోయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వదిలేశారు. కొండ ప్రాంతంలో ఆలయం ఉండటంతో ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియలేదు.
Read Also: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్సై గాయత్రి ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పూర్తిగా ఆలయం ధ్వంసము అయ్యి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయంపై హిందూ ధర్మిక సంస్థలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు ఆలయాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు ఆలయ కూల్చివేత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!