High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు.. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు.. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు.. అయితే, పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు.. భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. Read Also: Top Headlines @ 9 PM: టాప్…
HYDRA : హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం…
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అతిషి నియోజకవర్గమైన కల్కాజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గోవింద్పురి జుగ్గి క్లస్టర్లో ఉన్న 1,200కు పైగా అక్రమ గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు.
Hydra: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు నేడు (శుక్రవారం) అక్రమ హోర్డింగులపై దూకుడు పెంచారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా అక్రమ హోర్డింగులు పెరిగినట్లు గుర్తించడంతో, హైడ్రా అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 200 కి పైగా అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకంగా హైదరాబాద్-బెంగళూరు…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్పాత్లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు.
Demolition Mosque: ముంబై నగరంలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు అయిపోయింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతలు కొనసాగిస్తుంది.
Musi River Area: చైతన్యపురి సత్య నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాలు గుర్తించి రెవిన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు.
నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.
Hyderabad: నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.