అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు.