Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- మొలకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చే ప్రయత్నం
- గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ ఆలయం వద్ద బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్ళకు గంతలు కట్టిన దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12 నెలల క్రితం బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Read Also: IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
అయితే.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు. దీంతో ఆలయం ఒక వైపు వెళ్ళిపోయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వదిలేశారు. కొండ ప్రాంతంలో ఆలయం ఉండటంతో ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియలేదు.
Read Also: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్సై గాయత్రి ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పూర్తిగా ఆలయం ధ్వంసము అయ్యి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయంపై హిందూ ధర్మిక సంస్థలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు ఆలయాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు ఆలయ కూల్చివేత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!