Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- మొలకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చే ప్రయత్నం
- గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ ఆలయం వద్ద బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్ళకు గంతలు కట్టిన దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12 నెలల క్రితం బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Read Also: IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
అయితే.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు. దీంతో ఆలయం ఒక వైపు వెళ్ళిపోయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వదిలేశారు. కొండ ప్రాంతంలో ఆలయం ఉండటంతో ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియలేదు.
Read Also: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్సై గాయత్రి ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పూర్తిగా ఆలయం ధ్వంసము అయ్యి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయంపై హిందూ ధర్మిక సంస్థలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు ఆలయాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు ఆలయ కూల్చివేత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!