Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- మొలకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
- సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చే ప్రయత్నం
- గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ ఆలయం వద్ద బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్ళకు గంతలు కట్టిన దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12 నెలల క్రితం బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Read Also: IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
అయితే.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు. దీంతో ఆలయం ఒక వైపు వెళ్ళిపోయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వదిలేశారు. కొండ ప్రాంతంలో ఆలయం ఉండటంతో ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియలేదు.
Read Also: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్సై గాయత్రి ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పూర్తిగా ఆలయం ధ్వంసము అయ్యి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయంపై హిందూ ధర్మిక సంస్థలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు ఆలయాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు ఆలయ కూల్చివేత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?