AP Budget Session 2023: నాలుగేళ్లుగా పారదర్శక పాలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget Session 2023: ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లుగా పారదర్శక పాలన సాగిస్తున్నాం.. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు అందిస్తున్నాం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ.. నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్నామని వెల్లడించారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్య అందిస్తున్నాం.. రాష్ట్రంలోని యువత ప్రపంచస్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చామన్నారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకర ధోరణిలో ఉంది. 2022-23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలలో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయన్నారు.. ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలు అంటే వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరియు సేవల రంగం చెప్పుకోదగిన వృద్ధి తీరును చూపుతున్నాయి. అధిక సమగ్రాభివృద్ధిని నమోదు చేయడానికి ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ మరియు సేవల రంగాలు తోడ్పడ్డాడయన్నారు.. ప్రస్తుత ధరలలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2021-22లో రూ.1,92,517/- నుండి 14.02 శాతం ప్రోత్సాహక వృద్ధిరేటుతో రూ. 2,19,518/- లకు చేరినట్టు వెల్లడించారు.
Read Also: MK Stalin: శ్రీలంక చెర నుంచి భారతీయ జాలర్లను విడిపించాలి.. ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
మా ప్రభుత్వంచే సమర్ధ విధాన రూపకల్పన మరియు అమలు వల్ల 2021-22లో ఏటేటా 11.43 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటును సాధించింది.. ఇది అన్ని రాష్ట్రాల కంటే అత్యధికమని పేర్కొన్నారు గవర్నర్ . ఈ ప్రభుత్వం 2020-21 నుండి మన బడి – నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. రూ.3,669 కోట్ల ఆర్థిక వ్యయంతో మొదటి దశలో ఆధునీకరణ కోసం 15,717 పాఠశాలల్లో చేపట్టామన్నారు. రెండవ దశలో రూ.8,000 కోట్ల వ్యయాన్ని 22,344 పాఠశాలలకు వర్తింపు చేశామని.. మూడేళ్ల కాలంలో మొత్తం రూ.16.01.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమం కింద 57,189 పాఠశాలల్లో, 3,280 ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జగనన్న అమ్మఒడి’ కార్యక్రమం ద్వారా 84 లక్షల మంది పిల్లలను పాఠశాలలకు పంపడానికి 44.49 లక్షల మంది తల్లులకు జగన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా రూ.19,617.60 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని వెల్లడించారు. సంవత్సరానికి ప్రతి తల్లికి ఇస్తున్న రూ.15,000 మొత్తంలో నుండి రూ.1,000ని మరుగుదొడ్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నాం.. మరో వెయ్యి రూపాయలతో పాఠశాల నిర్వహణ నిధికి కేటాయించటం జరుగుతోందన్నారు.
Read Also: Attack on Hijras: హిజ్రాలపై పెళ్లి బృందం గొడ్డళ్లతో దాడి.. కాళ్లు మొక్కినా కనికరించలేదు..
వైసీపీ ప్రభుత్వం రూ.690 కోట్ల విలువగల 5.20 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసిందని వెల్లడించారా గవర్నర్.. ఈ ట్యాబ్లలో “బైజూస్” కంటెంట్ ప్రీలోడ్ చేయబడ్డాయి. వాటిని 8వ తరగతికి చెందిన 4.60 లక్షల మంది విద్యార్థులకు, 60,000 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మరోవైపు.. ఆరోగ్య శ్రీ క్రింద వర్తింపచేసిన ప్రొసీజర్లను 2022, అక్టోబరు నుండి 2,446 నుండి 3,255 కు పెంచడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం వర్తింపును 716 సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్ల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి రాష్ట్ర వెలుపలి నగరాలకు కూడా విస్తరించటం అయ్యిందన్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద ఇళ్ళ స్థలాలను, గృహాలను సమకూర్చడం ద్వారా 2024 నాటికి అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం శాశ్వత గృహాలను అందించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమం క్రింద మహిళా లబ్ధిదారుల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశామని.. ప్రతి ఇంటి స్థలం విలువ రూ.5 – 10 లక్షల మేరకు ఉంది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు 21.25 లక్షల గృహాలను మంజూరు చేసినట్టు తన ప్రసంగలో చెప్పుకొచ్చారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
తాజావార్తలు
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
-
Rohit – Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!