ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,028 శాంపిల్స్ పరీక్షించగా.. 643 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 839 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,86,12,576కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,55,306కు పెరిగింది.. ఇక, 20,32,520 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,236 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 8,550గా ఉన్నాయని.. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 145 కొత్త కేసులు వెలుగు చూసినట్టు బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.