CM YS Jagan: ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం సీరియస్.. ముగ్గురు మంత్రులతో కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు.. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు పెంచారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.. అయితే, తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి… రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Read Also: Karanam Dharmasri: రాజీనామా లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మీకు దమ్ముందా..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్.. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన ఆయన.. వారంరోజుల్లో నివేదిక అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు… నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు సీఎస్, సీనియర్ అధికారులు విజయానంద్, పూనం మాలకొండయ్య, కన్నబాబు ఉన్నారు. కాగా, ఆక్వా రైతులు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. సీఎం వైఎస్ జగన్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లడంతో.. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న సీఎం.. వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!