Somu Veerraju: విశాఖ గర్జన ప్రభుత్వ సభ.. వీరికి దశ, దిశ లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం అంటున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జేఏసీ ఇచ్చిన విశాఖ ఘర్జన పిలుపునకు మద్దతు ప్రకటించింది.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో సాగర తీరంలో గర్జన నిర్వహించారు.. అయితే, విశాఖ గర్జనపై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు.. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయ్యింది.. సోము వీర్రాజు అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి.. పార్టీ నేతలు శివప్రకాష్, దగ్గుబాటి పురంధేశ్వరి, సునీల్ దియోదర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, పదాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. విశాఖపట్నం దేశంలోనే అభివృద్ధి చెందటానికి ఒక వ్యూహాత్మక ప్రాంతం అన్నారు.. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 7 లక్షల 16 వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన.. దేశంలోని 11 కారిడార్లలో మూడు రాష్ట్రానికే ఇచ్చాం.. పోర్టుకు లక్ష కోట్లు, డిఫెన్స్ రంగానికి రెండు లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాల కోసం 50వేల కోట్ల రూపాయలను మోడీ ఇచ్చారని తెలిపారు.
Read Also: Palle Ravikumar : కాంగ్రెస్కు షాక్.. టీఆర్ఎస్లోకి పల్లె రవి దంపతులు
Also Read
అయితే, విశాఖ గర్జన ప్రభుత్వ సభగా ఎద్దేవా చేశారు సోము వీర్రాజు.. ఇటువంటి డ్వాక్రా సభలు చిన్నప్పటి నుంచి చూస్తున్నానని సెటైర్లు వేసిన ఆయన.. వీరికి ఒక దశ లేదు, దిశ లేదు అంటూ మండిపడ్డారు.. ఇక్కడే రాజధాని (అమరావతి) పెడతానని ఇల్లు కట్టుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు ఎందుకు విశాఖ రాజధాని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.. ఈ మూడేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఏం చేశారో వైసీపీ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..