Uravakonda Library: ఆ లైబ్రరీకి నిత్యం చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సహా ప్రముఖులు..! షాకైన మంత్రి..
- శిథిలావస్థకు చేరిన గ్రంథాలయానికి సినీ సెలబ్రిటీలు..!..
- రిజిస్టర్లో చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు..
- లైబ్రరీ రిజిస్టర్లో మృతిచెందిన నేతల పేర్లు..
- విచారణకు ఆదేశించిన మంత్రి పయ్యావుల కేశవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uravakonda Library: సినీ సెలబ్రిటీలు, పేరుమోసిన రాజకీయ నేతలు లైబ్రరీలకు వెళ్లి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. అయితే, అక్కడ మాత్రం నిత్యం సినీ సెలబ్రిటీలు వస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సహా పలువురు ప్రముఖులు ఉరవకొండలోని ప్రభుత్వ గ్రంథాలయానికి పుస్తకాలు చదవడానికి వస్తున్నారంట… వినడానికి , చదవడానికి ఆశ్చర్యం కలిగించే అంశమైన… లైబ్రరీ రిజిస్టర్ లో సంతకాలు మాత్రం ఇదే చెబుతోంది. అందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం చర్చగా మారింది..
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ గ్రంథాలయం శిథిలం కావడంతో కొత్త భవనం నిర్మాణం నిమిత్తం పలు వివరాలతో రావాలని మంత్రి పయ్యావుల కేశవ్.. గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డిని ఆదేశించారు.. గ్రంథాలయానికి నిత్యం వస్తున్న పాఠకుల రిజిస్టర్ తోపాటు నిల్వ ఉన్న పుస్తకాలు, ఇతరత్రా సమాచారంతో మంత్రి కార్యాలయానికి వెళ్లారు. పాఠకుల హాజరు పుస్తకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా చదివారు. అందులో మాజీ మంత్రి దివంగత పరిటాల రవి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, సినీ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు పుస్తక పఠనానికి వచ్చినట్లు ఉంది. దీనిని పరిశీలించిన మంత్రి విస్తుపోయారు. వీరంతా గ్రంథాలయంలో పఠనానికి వస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించగా.. దానికి ప్రతాపరెడ్డి సమాధానం ఇవ్వలేని పరిస్థితి.. సంబంధిత అధికారి అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల పేర్లతో ఉన్న సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి కేసు నమోదు చేయాలని సీఐ మహానందిని మంత్రి ఆదేశించారు. వెంటనే సీఐ ఆ దస్త్రాలు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. అయిదే అది ఆకతాయిల పనా..? లేదా నిర్వాహకులే.. రిజిస్టర్లో ఎక్కువ పేర్లు కనబడాలని ఈ పని చేశారా? ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది..
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!