Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు పడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ను పోలీసులు లేకుండా బయటకు రావాలని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు తన జడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేసి బయటకు వస్తే గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేసినందుకు ఆయన్ను మహిళలు చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సింగిల్గా బయటకు వస్తే ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హడలిపోయి చచ్చిపోతారన్నారు. జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా అని జనసేన కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ను ప్రశ్నించాలని అంబటి రాంబాబు సూచించారు.
Also Read
జనసేన కార్యకర్తలు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో కూడా ఈ రాష్ట్రానికి సీఎం జగనే అవుతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. కరోనాతో ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోయినా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు.
Pawan Kalyan: నేను సింగిల్గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లెవరు?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..