Ambati Rambabu: అమరావతి అనేదే పెద్ద కుంభకోణం.. ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. అమరావతి ప్రజా రాజధాని కాదు అని పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారని.. పవన్ కళ్యాణ్ ఆ పుస్తకాన్ని ఒకసారి చదివి అప్పుడు రైతుల పాదయాత్ర గురించి మాట్లాడాలని హితవు పలికారు.
Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
అయినా అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నాడా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అందులో ఉన్నది అంతా బలిసిన బ్యాచేనని ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకచోట కేంద్రీకరిస్తే ప్రాంతీయ విబేధాలు రావా అని ప్రతిపక్షాలను నిలదీశారు. పాదయాత్ర చేస్తున్న వారు ల్యాండ్ స్కాంలో కూడా ఉన్నారన్నారు. అసైన్డ్ భూములను నారాయణ, గంటా, వారి తాబేదారులు కుంభకోణానికి పాల్పడింది నిజం కాదా అని సూటి ప్రశ్న వేశారు. బీసీ, ఎస్సీల భూములను బెదిరించి లాక్కున్నది నిజం కాదా అన్నారు. పాదయాత్రలో దొంగలతో పాటు దోచుకుందాం అనే ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్లో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఎలాంటి ఉద్యమాలు రాకూడదు, ప్రాంతీయ విద్వేషాలు చెలరేగకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానులకు రూపకల్పన చేసిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!