Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asha Bhosle : సంగీతానికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పే అరుదైన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. భారతీయ సంగీత ప్రపంచానికి చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఆశా భోస్లే. ఆమె జ్ఞాపకాలను ఉత్తర లండన్లోని వేలాది మంది ప్రేక్షకుల మధ్య సజీవంగా నిలిపింది ప్రముఖ బ్రిటిష్ వర్చువల్ బ్యాండ్ గొరిల్లాజ్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యాండ్ లేటెస్ట్ షోలో ఆశా భోస్లేకు ప్రత్యేక నివాళి అర్పించడంతో భారతీయ సంగీత అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. లండన్ లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో జరిగిన ఈ భారీ సంగీత వేడుకలో ఆశా భోస్లే సంగీత వారసత్వాన్ని గుర్తు చేస్తూ ‘ది షాడోయీ లైట్’ పాటను గొరిల్లాజ్ ప్రదర్శించింది. ఈ సందర్భంగా వేదికపై ఆశా భోస్లేకు సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించగా, స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరోసారి గౌరవించిన ఈ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. గొరిల్లాజ్ వ్యవస్థాపకుడు డేమన్ ఆల్బార్న్తో కలిసి ఆమె వేదికపై కనిపించడం అభిమానులు మరింత ఎమోషనల్ అయ్యారు. ఆశా భోస్లే గాత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందో ఈ నివాళి మరోసారి చాటిచెప్పింది. డేమన్ ఆల్బార్న్, జేమీ హ్యూలెట్ కలిసి రూపొందించిన గొరిల్లాజ్ బ్యాండ్ ప్రపంచ సంగీతంలో తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. వారి తాజా ఆల్బమ్ ‘ది మౌంటెన్’లో భారతీయ శాస్త్రీయ సంగీత ప్రభావాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. భారతీయ సంగీత సంప్రదాయంపై ఈ బ్యాండ్కు ఉన్న అభిమానాన్ని ఈ నివాళి మరింత స్పష్టంగా చూపించింది.
Also Read
- Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
- Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
- Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ఈ ప్రదర్శన ఆశా భోస్లే మరణించిన రెండు నెలల తర్వాత జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్లో 92 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూయడంతో భారతీయ సినీ, సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు వేలాది పాటలతో కోట్లాది మంది సంగీత ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆశా భోస్లే, భారతీయ సంగీత చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. హిందీ సినీ సంగీతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలపై ఆమె గాత్రం అభిమానులను అలరించింది. ఇప్పుడు లండన్లో గొరిల్లాజ్ అర్పించిన ఈ ఘన నివాళి, ఆశా భోస్లే సంగీతానికి భౌగోళిక సరిహద్దులు లేవని మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. తరాలు మారినా, దేశాలు మారినా, ఆమె స్వరం మాత్రం సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటుందని ఈ అరుదైన సంగీత క్షణం మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
-
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
-
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?