YS Jagan: నేడు శ్రీకాకుళం నేతలతో జగన్ భేటీ..
- నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
- హాజరుకానున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు..
- స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్.. పార్టీ బలోపేతం.. నాయకత్వంలో ధైర్యం.. భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగా.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమైంది వైసీపీ. జనం పడుతున్న ఇబ్బందులపై నిలదీయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత జగన్. తొలి విడతలో రైతులు, విద్యార్థులు, విద్యుత్ సమస్యలపై పోరాటం చేయనుంది. ఈ నెల 11, 27 తారీఖులతో పాటు వచ్చే ఏడాది జనవరి 3న నిరసన కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చిన విషయం విదితమే..
Read Also: Bitcoin Price: లక్ష డాలర్స్ను దాటేసిన బిట్కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
రైతుల సమస్యలపై ఈ నెల 11న ర్యాలీలు నిర్వహించాలని… కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని వైసీపీ శ్రేణులకు సూచించారు జగన్. పెట్టుబడి సహాయంగా 20 వేల రూపాయలు ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేయనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న వైసీపీ ఆందోళన చేయనుంది. ఎస్ఈ, సీఎండీ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఆ పార్టీ శ్రేణులు. వచ్చే ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేయనుంది వైసీపీ.. ఫీజు రియింబర్స్మెంట్, వసతిదీవెన బకాయిలు ఇవ్వాలని కోరనుంది. విద్యార్థులతో కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి… వినతిపత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..