YS Jagan: నేడు శ్రీకాకుళం నేతలతో జగన్ భేటీ..
- నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
- హాజరుకానున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు..
- స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్.. పార్టీ బలోపేతం.. నాయకత్వంలో ధైర్యం.. భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగా.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమైంది వైసీపీ. జనం పడుతున్న ఇబ్బందులపై నిలదీయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత జగన్. తొలి విడతలో రైతులు, విద్యార్థులు, విద్యుత్ సమస్యలపై పోరాటం చేయనుంది. ఈ నెల 11, 27 తారీఖులతో పాటు వచ్చే ఏడాది జనవరి 3న నిరసన కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చిన విషయం విదితమే..
Read Also: Bitcoin Price: లక్ష డాలర్స్ను దాటేసిన బిట్కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?
Also Read
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
రైతుల సమస్యలపై ఈ నెల 11న ర్యాలీలు నిర్వహించాలని… కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని వైసీపీ శ్రేణులకు సూచించారు జగన్. పెట్టుబడి సహాయంగా 20 వేల రూపాయలు ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేయనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న వైసీపీ ఆందోళన చేయనుంది. ఎస్ఈ, సీఎండీ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఆ పార్టీ శ్రేణులు. వచ్చే ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేయనుంది వైసీపీ.. ఫీజు రియింబర్స్మెంట్, వసతిదీవెన బకాయిలు ఇవ్వాలని కోరనుంది. విద్యార్థులతో కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి… వినతిపత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!