YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..
- నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ..
- కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం..
- మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది..
- జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం..
- అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..
- మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి అని జగన్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని కొందరు శ్రేయోభిలాషులు తనకు చెప్పారని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలన్నారు.. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమేనని.. పులినోట్లో తలకాయపెట్టడమేనన్నారు.. చంద్రబాబుకూ, జగన్కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు.. కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరని, వారికీ ఆ ధైర్యంకూడా లేదన్నారు.. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు.. నాయకులంతా యాక్టివ్గా ఉండాల్సిన సమయం వచ్చేసిందన్నారు.. తాను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తానని.. ప్రతి వారం మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిచేస్తానన్నారు..
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
ఇక, కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్.. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం.. కానీ, ఇప్పుడు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్లో పెట్టారు.. ఆరోగ్యశ్రీకింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం.. 8 నెలల కాలంలోనే 3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారని మండిపడ్డారు.. ఇంటివద్దకే డోర్డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.. నాయకులంతా యాక్టివ్గా ఉండాల్సిన సమయం వచ్చేసిందని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!