YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..
- నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ..
- కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం..
- మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది..
- జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం..
- అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..
- మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి అని జగన్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని కొందరు శ్రేయోభిలాషులు తనకు చెప్పారని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలన్నారు.. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమేనని.. పులినోట్లో తలకాయపెట్టడమేనన్నారు.. చంద్రబాబుకూ, జగన్కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు.. కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరని, వారికీ ఆ ధైర్యంకూడా లేదన్నారు.. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు.. నాయకులంతా యాక్టివ్గా ఉండాల్సిన సమయం వచ్చేసిందన్నారు.. తాను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తానని.. ప్రతి వారం మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిచేస్తానన్నారు..
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
ఇక, కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్.. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం.. కానీ, ఇప్పుడు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్లో పెట్టారు.. ఆరోగ్యశ్రీకింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం.. 8 నెలల కాలంలోనే 3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారని మండిపడ్డారు.. ఇంటివద్దకే డోర్డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.. నాయకులంతా యాక్టివ్గా ఉండాల్సిన సమయం వచ్చేసిందని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!