Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi We Will Put Special Focus On Social Media Trolling And Will Set Up A Special Department Says Cm Chandrababu

CM Chandrababu: సోషల్ మీడియాపై స్పెషల్‌ ఫోకస్.. ప్రత్యేక విభాగం పెడతాం..

Published Date :July 25, 2024 , 3:51 pm
By Sudhakar Ravula
  • ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు..
  • సోషల్ మీడియాపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం..
  • ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం..
  • సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతాం..
CM Chandrababu: సోషల్ మీడియాపై స్పెషల్‌ ఫోకస్.. ప్రత్యేక విభాగం పెడతాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు చంద్రబాబు.. ఇక, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓ రోజంతా శాంతి భద్రతలపై చర్చిద్దాం.. వివిధ వర్గాలు, ఉద్యోగులు, అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులను ఏం చేయాలనే దానిపై సమీక్షిస్తాం. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అని స్పష్టం చేశారు చంద్రబాబు.

Read Also: Balakrishna: బాలయ్యా.. ఏందయ్యా ఈ జోరు.. కుర్ర హీరోలతో పోటీనా?

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ వ్యవహరించ వద్దు అని సూచించారు చంద్రబాబు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్న ఆయన.. చాలా మందికి బాధ ఉంది.. ఆవేశం ఉంది.. నాయకులుగా మనమే కాదు.. కార్యకర్తల్లోనూ ఆవేదన ఉందని.. కానీ, కక్షసాధింపునకు ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదన్నారు. ప్రాణ సమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నాను. నేను చంద్రయ్య పాడె మోశాను.. నేను ఎలా మరిచిపోగలను…? అని ప్రశ్నించారు. సినిమాల్లో నటించే పవన్ కల్యాణ్‌ కూడా రోడ్ మీద పడుకునేలా చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండని ఓ బాధితురాలు నన్ను కోరింది. మాకేం చేయొద్దు సార్.. మాకు రక్షణ కల్పిస్తే చాలు అని మాత్రమే కోరారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఫ్యామ్లీ విషయాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా మీద ప్రత్యేక ఫోకస్ పెడతాం అన్నారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..

Read Also: Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?

ఈ శ్వేత పత్రం విడుదల చేసే సమయంలో జగన్ ఉండుంటే.. తానేం చేశానోనని ఓసారి ఆలోచన చేసేవాడేమో..? అన్నారు చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సయ్యారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మైనార్టీ విద్యార్థినులు చదువుకునే హక్కును కూడా లాగేసుకున్నారు. మిస్బా అనే చిన్నారిని చనిపోయేలా చేశారు. అమరావతి మహిళా రైతుల బాత్రూంలపై డ్రోన్లు ఎగరేశారు. జగన్ సభలకు బ్లాక్ చున్నీలు కూడా ఉండకుండా చూసుకునేవారు. హెలీకాప్టరులో వెళ్తోన్నా పరదాలు కట్టారు.. చెట్లు కొట్టారు. దేవాలయాలపై దాడులు చేశారు.. దోపిడీలు చేశారు. స్ఖానిక సంస్థల్లో పోటీ చేయలేని పరిస్థితి సృష్టించారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రక్షణ లేకుండా పోయింది. నిమ్మగడ్డ ఫ్యామ్లీకి రక్షణ కోసం కేంద్రాన్ని కోరాల్సిన పరిస్థితి కల్పించారు. హు కిల్డ్ బాబాయ్..? ఇప్పటికీ సమాధానం లేదు. వివేకా హత్యలో రకరకాల ట్విస్టులు ఇచ్చారు. తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ అధికారుల మీద కేసు పెట్టారు. అవినాష్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐకు నాటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించ లేదు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు. సానుభూతితో జగన్ గెలిచి ఉంటే.. ప్రజాస్వామ్యం రక్షణ లేకుండా పోయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • social media
  • social media trolling
  • Special Focus

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..

  • Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

ట్రెండింగ్‌

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions