CM Chandrababu: టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు
- గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు..
- ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నాం..
- టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.. కానీ, గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.. కనీసం కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేదు.. ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు.. అందుకే తొలి అడుగు అన్నాము.. రాష్ట్రంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సహకరించారు అని చంద్రబాబు తెలిపారు.
Read Also: ENERepeat : టీమ్ కన్యారాశి మళ్ళి వస్తోంది.. ఈ నగరానికి ఏమైంది – 2 స్టార్ట్
Also Read
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఇక, టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారం మనకు ముఖ్యం కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. ఏ రాజకీయ పార్టీకి రాని అవకాశాలు మనకు వచ్చాయి.. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక పరిస్థితి బయటకు వచ్చే వాతావరణం లేదు.. ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికి ఎన్నో చేస్తున్నాం.. దక్షిణ భారత రాష్ట్రాల్లో మనది విభిన్న పరిస్థితి.. రాష్ట్ర ఆదాయంలో సర్వీసు సెక్టార్ ఎక్కువ.. దీపం పథకంలో ఇప్పటికే సిలిండర్ పంపిణీ జరుగుతోంది.. పొగాకు కొనేవారు లేకపోతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాం.. పామాయిల్ మిర్చి ఇలా ప్రతి రైతులకు న్యాయం చేస్తున్నాం.. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Sreeleela: శ్రీలీల.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
అయితే, అన్నా క్యాంటీన్ లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే నెల అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందుతాయి.. అమరావతికి ఇప్పటికే రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయి.. అమరావతి పనులు ట్రాక్ లో పడ్డాయి.. 2027కి పోలవరం జాతికి అంకితం అవుతుంది.. స్టీల్ ప్లాంట్ ను కూడా లాభాల బాట పెట్టే పరిస్థితి వచ్చింది.. కృష్ణ పట్నం పోర్ట్ పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఆగస్ట్ 15 నాటికి 700 సర్వీస్ లు ఆన్ లైన్ లో ఉంటాయి.. టీడీపీ చేసే సర్వేలు ఎవరు చెయ్యరు.. అన్ని స్థాయిల్లో ఇప్పటికే సర్వేలు జరిగాయి.. మనం ఏమనుకుంటున్నామనేది ముఖ్యం కాదన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యం.. ఒకరు చేసిన పనులు చెప్పగలరు.. దీని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Kayadu Lohar : ఒకే ఒక్క హిట్ తో కయాదు లోహర్ దశ తిరిగింది
కాగా, టీడీపీ ఒక కుటుంబం.. ఎర్రంనాయుడు పార్టీకి పని చేస్తే ఆయన కుమారుడు కేంద్రమంత్రి అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బాలయోగి చనిపోయినప్పుడు ఆయన కుమారుడు చిన్నవాడు.. కానీ ఇప్పుడు ఎంపీ అయ్యారు.. కుప్పంలో కార్యకర్తలు సరిగ్గా లేకపోయినా చర్యలు ఉంటాయి.. వెయ్యి, రెండు వేల నోట్లను రద్దు చేయాలని నేనే చెప్పాను.. రూ. 500 నోట్లు కూడా రద్దు చేయాలని తెలిపాను.. డబ్బులతోనే గెలుస్తామంటే కుదరదు అన్నారు. మొన్న ఎన్నికల్లో వాళ్లకి 11 మాత్రమే వచ్చాయి.. మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు.. సమర్థమైన పాలన వల్లే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. రాష్ట్రాన్ని ఐదు జోన్లగా విభజించి అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కమిన్స్కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
-
Disha-Mouni: లెస్బియన్ రూమర్స్కు చెక్ పెట్టాలనుకున్న మౌనీ రాయ్.. కానీ రివర్స్ అయిందే..?
-
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!