Tirumala Laddu Controversy: స్పష్టంగా హామీ ఇస్తున్నా..! తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారీ
- తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారు..
- ఆ దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు..
- ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానన్న సోము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.. స్వచ్ఛమైన నెయ్యి కేజీ 319 రూపాయలకు లభిస్తుందా..? అది నెయ్యా అని ప్రశ్నించారు వీర్రాజు.. బీజేపీ డిమాండ్ కు వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నవరంలో కిలో నెయ్యి 520 రూపాయలకు తీసుకుంటుంటే.. తిరుపతిలో నెయ్యి 319 రూపాయలు తీసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు.. అన్నవరం ప్రసాదం నెయ్యి మంచిదా…? తిరుమల లడ్డూ నెయ్యి చెడ్డదా ? అని ప్రశ్నించారు.
Read Also: Jagtial Residential in Iraq: సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
ఇక, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో అవకతకులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సోము వీర్రాజు.. ప్రసాదాలు తయారీ కోసం కొనే పదార్థాలు కొన్ని విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలని కోరారు. టీటీడీ బడ్జెట్ 6000 కోట్ల రూపాయలు అయితే లడ్డూ ప్రసాదానికి 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదానికి కేవలం 10 శాతం మాత్రమే ఖర్చు చేయడం దారుణమని దుయ్యబట్టారు.. అన్నవరంలో నెయ్యి 520 రూపాయలకు ఎందుకొంటున్నారని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో న్యాయమేని ప్రసాదాన్ని అందించే విధంగా ఆలోచన చేయాలని.. ఇందుకోసం బీజేపీ ఆలోచన చేస్తుందని అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే వాటికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు..
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!