Jagtial Residential in Iraq: సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..
- ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు..
- భోజనం పెట్టవద్దని కంపెనీ యజమాని మెస్ కు హుకుం ..
- 20 రోజుల క్రితం ఈ ముగ్గురు పై దాడి చేసి బలవంతంగా పనిలోకి..
- కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు ఒక్కొక్కరు లక్షల్లో చెల్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Residential in Iraq: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కూలీల దుస్థితి తరచుగా వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇరాక్లో చిక్కుకున్న ముగ్గురు తెలంగాణ వాసులను భారత్కు తీసుకెళ్లాలని మొరపెట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లె గ్రామానికి చెందిన పంగ సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన బట్టు హరీశ్, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఒరికె నడిపి రాజన్న ఐదు నెలలుగా వేతనాలు అందక ఇరాక్లో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇరాక్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. ఎంబసీకి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ యాజమాన్యం వారిపై దాడి చేసి.. తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
Read also: Jangaon Bathukamma: జనగామ బతుకమ్మకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
Also Read
రెండేళ్ల క్రితం కరీంనగర్కు చెందిన ఏజెంట్కు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు చెల్లించి ఇరాక్లోని సమర్ అల్ షకీర్ కంపెనీకి వెళ్లారు. జీతం నెలకు 400 డాలర్లు మాత్రమే ఇస్తున్నాడని వాపోయారు. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ముగ్గురు కార్మికులు ఉద్యోగాలు వదులుకున్నారని అయినా.. యాజమాన్యం కష్టాలకు గురి చేస్తున్నాడని కన్నీరుపెట్టుకున్నారు. అంతేకాకుండా వారికి ఆహారం ఇవ్వవద్దని కంపెనీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని మొరపెట్టుకున్నారు. పని చేయలేక, తిండిలేక గదుల్లో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. 20 రోజుల క్రితం యజమాని వచ్చి ముగ్గురిపై దాడి చేసి బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు ఈ నెల 11న సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఇరాక్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. కాగా ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు కష్టాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతం అయ్యారు. సార్ మా వాళ్లను వెంటనే భారత్ కు రప్పించాలని వేడుకున్నారు.
Deputy CM Pawan Kalyan: తిరుమల డిక్లరేషన్పై సంతకం చేసిన పవన్ కల్యాణ్.. ఎందుకంటే..?
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!