Tirumala Laddu Controversy: స్పష్టంగా హామీ ఇస్తున్నా..! తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారీ
- తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారు..
- ఆ దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు..
- ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానన్న సోము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.. స్వచ్ఛమైన నెయ్యి కేజీ 319 రూపాయలకు లభిస్తుందా..? అది నెయ్యా అని ప్రశ్నించారు వీర్రాజు.. బీజేపీ డిమాండ్ కు వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నవరంలో కిలో నెయ్యి 520 రూపాయలకు తీసుకుంటుంటే.. తిరుపతిలో నెయ్యి 319 రూపాయలు తీసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు.. అన్నవరం ప్రసాదం నెయ్యి మంచిదా…? తిరుమల లడ్డూ నెయ్యి చెడ్డదా ? అని ప్రశ్నించారు.
Read Also: Jagtial Residential in Iraq: సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
ఇక, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో అవకతకులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సోము వీర్రాజు.. ప్రసాదాలు తయారీ కోసం కొనే పదార్థాలు కొన్ని విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలని కోరారు. టీటీడీ బడ్జెట్ 6000 కోట్ల రూపాయలు అయితే లడ్డూ ప్రసాదానికి 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదానికి కేవలం 10 శాతం మాత్రమే ఖర్చు చేయడం దారుణమని దుయ్యబట్టారు.. అన్నవరంలో నెయ్యి 520 రూపాయలకు ఎందుకొంటున్నారని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో న్యాయమేని ప్రసాదాన్ని అందించే విధంగా ఆలోచన చేయాలని.. ఇందుకోసం బీజేపీ ఆలోచన చేస్తుందని అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే వాటికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు..
తాజావార్తలు
-
Vaibhav Batting: ‘నా బౌలింగ్లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్కు బౌలింగ్ వేయలేను’..
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!