Shining Stars Awards: ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు.. మార్గదర్శకాలు విడుదల
- విద్యార్థులను ప్రోత్సహించే సర్కార్ కీలక నిర్ణయం..
- 2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు..
- టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు..
- మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shining Stars Awards: విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి గానూఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. టెన్త్, ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.. ఇక, షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.. క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొంది ప్రభుత్వం.. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు 2024-25 ఏడాదికి జిల్లా స్థాయిలో అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ఈ అవార్డుల ప్రదానంతో.. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ.. పదోతరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మండలాల వారీగా అవార్డులకు ఎంపిక చేసి.. ఆ అవార్డులను అందించనున్నారు.. ఇక, ఇంటర్ లో 830.. ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు అందజేయనున్నారు.. ప్రతి మండలంలో మొత్తం ఆరుగురు ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ప్రతి మండలంలో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులకు అవార్డులు ఇస్తారు.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతి జిల్లాకు 36 అవార్డుల చొప్పున అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. అవార్డుకు ఎంపికైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్తో పాటు 20 వేల నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..
Read Also: Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
కాగా, ఇప్పటికే మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. విద్యార్థులను అభినందించిన విషయం విదితమే.. స్కూళ్లలో ఉన్న సమస్యలపై కూడా ఈ సందర్భంగా ఆరా తీశారు మంత్రి.. అంతేకాదు.. ఉన్నత చదువుల కోసం మీకు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించి, సత్కరించారు. షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగింది, ఈ కార్యక్రమంలో లోకేష్ విద్యార్థులకు బంగారు పతకాలు మరియు ల్యాప్టాప్లను అందజేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?