Shining Stars Awards: ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు.. మార్గదర్శకాలు విడుదల
- విద్యార్థులను ప్రోత్సహించే సర్కార్ కీలక నిర్ణయం..
- 2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు..
- టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు..
- మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ..
Shining Stars Awards: విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి గానూఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. టెన్త్, ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.. ఇక, షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.. క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొంది ప్రభుత్వం.. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు 2024-25 ఏడాదికి జిల్లా స్థాయిలో అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ఈ అవార్డుల ప్రదానంతో.. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ.. పదోతరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మండలాల వారీగా అవార్డులకు ఎంపిక చేసి.. ఆ అవార్డులను అందించనున్నారు.. ఇక, ఇంటర్ లో 830.. ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు అందజేయనున్నారు.. ప్రతి మండలంలో మొత్తం ఆరుగురు ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ప్రతి మండలంలో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులకు అవార్డులు ఇస్తారు.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతి జిల్లాకు 36 అవార్డుల చొప్పున అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. అవార్డుకు ఎంపికైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్తో పాటు 20 వేల నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..
Read Also: Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
కాగా, ఇప్పటికే మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. విద్యార్థులను అభినందించిన విషయం విదితమే.. స్కూళ్లలో ఉన్న సమస్యలపై కూడా ఈ సందర్భంగా ఆరా తీశారు మంత్రి.. అంతేకాదు.. ఉన్నత చదువుల కోసం మీకు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించి, సత్కరించారు. షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగింది, ఈ కార్యక్రమంలో లోకేష్ విద్యార్థులకు బంగారు పతకాలు మరియు ల్యాప్టాప్లను అందజేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!