Sajjala Ramakrishna Reddy: జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం లేదన్నారు. చేయగలిగినంతా ప్రభుత్వం చేసింది.. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని పేర్కొన్నారు. వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే.. తమ హామీలోనూ నిజాయితీ ఉందని చెప్పారు.
India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
బాలింతలు, పసి పిల్లలు, గర్భిణీలకు ఆహారం అందించటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఏ రకంగా వ్యవహరించిందో అందరం చూశామన్నారు. జీతాల పెంపు ఒక్కటే చేయలేం అని చెప్పాం.. వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. జైలుకు కూడా వెళ్తాం అంటున్నారు.. ఇటువంటి బెదిరింపు ధోరణి వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని చెప్పారు. రాజకీయ అజెండాకు బలి కావద్దు అని కోరుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కూడా ఇదే చెబుతున్నాం.. ప్రజా సేవలు అందించటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మీరంతా కూడా ప్రభుత్వంలో భాగం.. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు.
Nandyala: రేపు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు..
రౌండ్ టేబుల్ పేరుతో చేసిన సమావేశంలో టీడీపీ వాళ్ళే ఉన్నారని సజ్జల తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది.. ఆ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదేదో హెచ్చరిక కాదు.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. వాళ్ళు ఎందుకు ఎన్నికల విధుల్లో ఉంటారు? అని ప్రశ్నించారు. ఆరోపణలకు అర్థం పర్థం లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. టీడీపీకి ఈసారి 23 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఓటమి కారణాలు చెప్పుకోవటానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.. బరితెగించి బండగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు తెలిసిన విద్య ఇది ఒకటేనని సజ్జల ఆరోపించారు.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?