Sajjala Ramakrishna Reddy: జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం లేదన్నారు. చేయగలిగినంతా ప్రభుత్వం చేసింది.. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని పేర్కొన్నారు. వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే.. తమ హామీలోనూ నిజాయితీ ఉందని చెప్పారు.
India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
Also Read
- YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
- CM Chandrababu : రెండేళ్ల పాలన.. చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
బాలింతలు, పసి పిల్లలు, గర్భిణీలకు ఆహారం అందించటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఏ రకంగా వ్యవహరించిందో అందరం చూశామన్నారు. జీతాల పెంపు ఒక్కటే చేయలేం అని చెప్పాం.. వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. జైలుకు కూడా వెళ్తాం అంటున్నారు.. ఇటువంటి బెదిరింపు ధోరణి వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని చెప్పారు. రాజకీయ అజెండాకు బలి కావద్దు అని కోరుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కూడా ఇదే చెబుతున్నాం.. ప్రజా సేవలు అందించటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మీరంతా కూడా ప్రభుత్వంలో భాగం.. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు.
Nandyala: రేపు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు..
రౌండ్ టేబుల్ పేరుతో చేసిన సమావేశంలో టీడీపీ వాళ్ళే ఉన్నారని సజ్జల తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది.. ఆ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదేదో హెచ్చరిక కాదు.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. వాళ్ళు ఎందుకు ఎన్నికల విధుల్లో ఉంటారు? అని ప్రశ్నించారు. ఆరోపణలకు అర్థం పర్థం లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. టీడీపీకి ఈసారి 23 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఓటమి కారణాలు చెప్పుకోవటానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.. బరితెగించి బండగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు తెలిసిన విద్య ఇది ఒకటేనని సజ్జల ఆరోపించారు.
తాజావార్తలు
-
West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!