Sajjala Ramakrishna Reddy: జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం లేదన్నారు. చేయగలిగినంతా ప్రభుత్వం చేసింది.. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని పేర్కొన్నారు. వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే.. తమ హామీలోనూ నిజాయితీ ఉందని చెప్పారు.
India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
Also Read
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
బాలింతలు, పసి పిల్లలు, గర్భిణీలకు ఆహారం అందించటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఏ రకంగా వ్యవహరించిందో అందరం చూశామన్నారు. జీతాల పెంపు ఒక్కటే చేయలేం అని చెప్పాం.. వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. జైలుకు కూడా వెళ్తాం అంటున్నారు.. ఇటువంటి బెదిరింపు ధోరణి వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని చెప్పారు. రాజకీయ అజెండాకు బలి కావద్దు అని కోరుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కూడా ఇదే చెబుతున్నాం.. ప్రజా సేవలు అందించటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మీరంతా కూడా ప్రభుత్వంలో భాగం.. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు.
Nandyala: రేపు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు..
రౌండ్ టేబుల్ పేరుతో చేసిన సమావేశంలో టీడీపీ వాళ్ళే ఉన్నారని సజ్జల తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది.. ఆ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదేదో హెచ్చరిక కాదు.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. వాళ్ళు ఎందుకు ఎన్నికల విధుల్లో ఉంటారు? అని ప్రశ్నించారు. ఆరోపణలకు అర్థం పర్థం లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. టీడీపీకి ఈసారి 23 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఓటమి కారణాలు చెప్పుకోవటానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.. బరితెగించి బండగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు తెలిసిన విద్య ఇది ఒకటేనని సజ్జల ఆరోపించారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..