Rajya Sabha Members: రాజ్యసభ రాజకీయం.. విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్త చర్చ..!
- రాజ్యసభ సభ్యులకు ఏం జరుగుతోంది..
- వరుసగా రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు..
- విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్త చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Members: రాజ్యసభలో పెద్దలుంటారు.. వయసులో కాదు.. హోదాలో.. అందుకే పెద్దల సభ అంటారు. మరిక్కడ ఏం జరుగుతోంది.. కొంతమంది. పెద్దల వ్యవహార శైలి ఎందుకు విచిత్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైన.. టీడీపీ, వైసీపీల్లో రాజ్యసభ సభ్యుల తీరు మరింత ఆశ్చర్యంగా.. ఇంకొంచెం విచిత్రంగానూ ఉంది.. సాయిరెడ్డి రాజీనామాతో ఈ చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ పదవుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేది.. ప్రధానంగా చంద్రబాబు ఆచి తూచి కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో పదవులు ఇచ్చారు.. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయినవారు చాలా మంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు.. రేణుక చౌదరి.. తులసి రెడ్డి.. సి రామచంద్రయ్య.. కిమిడి కళా వెంకట్రావ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి.. వంగా గీత.. మైసూరారెడ్డి.. మోహన్ బాబు.. ఇలా చాలా మంది రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరిపోయారు.
Read Also: Mamatha Kulakarni: మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక, 2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరి.. టీజీ వెంకటేష్.. సీఎం రమేష్.. గరికిపాటి రాంమోహన్ రావు.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు.. అయితే వీళ్ళు ఇంకా పదవి కాలం ఉండగానే బీజేపీలో చేరారు.. ఒక్క కనకమేడల రవీంద్రబాబు ఒక్కరే మొన్నటి వరకు అంటే ఒక యేడాది కిందటి వరకు పదవిలో ఉన్నారు .. తర్వాత అసలు టీడీపీకి రాజ్యసభలో ఒకరు కూడా లేరు. ఇప్పుడు ఇదే సీన్ వైసీపీ లో కనిపిస్తోంది… విజయ్ సాయిరెడ్డి పార్టీకి.. రాజ్యసభకు కూడా రాజీనామా ఇచ్చేసారు.. వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు . ఇక్కడే అసలు రాజ్యసభ ఈ పార్టీలకు అచ్చి రావడం లేదా అనే చర్చ స్టార్ట్ అయ్యింది.. వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్ అయ్యారు. మోపిదేవి.. ఆర్ కృష్ణయ్య.. బీద మస్తాన్ రావ్.. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి.. ఇక, మిగిలిన వైసీపీ బలం 6కు వచ్చేసింది.. ఇక, వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది కూడా చూడాలి.. గతంలో టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరుతున్నారు.. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వైపు వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.. వ్యాపార అవసరాలు.. ఇతర కారణాలు.. కేస్ లు కూడా వీటికి తోడవుతున్నాయనే చర్చ కుడా జరుగుతోంది..
Read Also: Private Junior Colleges: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కోర్టులో దక్కని ఊరట.. విద్యార్థులపై భారం..
ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోయిన పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు.. వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలి.. కానీ, కేవలం. రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం ఒక ప్రత్యేక ఎజెండా తెరపైకి వస్తోంది.. దీంతో పవర్ పోతే ఆటోమాటిక్ గా జంప్ అయిపోతున్నారు.. పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్నారని రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తున్నారు.. కానీ, వాస్తవ పరిస్థితిలో వీటిని పక్కన పెట్టి జంప్ అవ్వడంతో ప్రాంతీయ పార్టీల్లో రాజ్యసభ సభ్యుల విషయంలో కొత్త చర్చ మొదలవుతోంది…
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!