Minister Lokesh: వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?
- వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్
- వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?- లోకేష్
- జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు. సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై పదో శాతం మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీకి ఉండాలన్నారు. అలా ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదని తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మేల్యేలను లాగితే చంద్రబాబుకి 17,18 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత హోదా కూడా చంద్రబాబుకి ఉండదు అని జగన్ చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్కి క్లియర్ మెసేజ్..
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
మరోవైపు.. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు.. ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రానికి చేసింది ఏంటి..? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ఏమైంది..? అని అడిగారు. మాట తప్పం మడం తిప్పము అన్నారు.. అమరావతి పై మాట తప్పారని లోకేష్ తెలిపారు. గత ఐదేళ్లలో గన్ పాయింట్లో ఆస్తులు లాక్కున్నారు.. కాకినాడ పోర్ట్ లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచామని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. అలాగే.. తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసామన్నారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం.. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకు వచ్చింది తామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పాఠశాలల్లో 12 లక్షల మంది తగ్గిపోయారు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Lenovo IdeaPad Slim 5: AI ఫీచర్లతో లెనోవా కొత్త ల్యాప్ టాప్.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!